పుట:మత్స్యపురాణము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

83


జేకొని మిమ్ముఁ గెల్చి యతిచిత్రమహాఘసమేతుఁ డైన యా
లోకవినిందితున్ నరకలోకముఁ జేర్చెదఁ బంత మొప్పఁగన్.

98


వ.

అని యిట్లహంకారపూర్వకంబుగఁ బితృపతి పలికిన వచనంబులకు రోషిం
చి విష్ణుకింకరు లిట్లనిరి.

99


క.

దురమున మము గెలిచెద నని
హరిహయుఁడుం బలుకనోపఁ డంతక! నేఁ డీ
హరిభక్తులసామర్థ్యం
బెఱిఁగెద విఁకఁ బ్రల్లదంబు లేలా పలుకన్.

100


మ.

మురువొప్పం గమలోదరుండు తులసీమూలంబునన్ లచ్చితో
నిరవైయుండెడిచో సుభద్రుఁ డచటన్ హీనాత్ముఁడై పాపదు
ర్ధరుఁడయ్యున్ మృతిఁబొందెఁ గావున జగత్ప్రఖ్యాతి నింద్రాదు ల
చ్చెరువొందం జనువాఁడు మోక్షపదవీశృంగారదివ్యాంగుడై.

101


వ.

అని మఱియు నొక్కపూర్వవృత్తాంతంబు చెప్పెద మాకర్ణింపుము.

102


గీ.

శేషశాయియైన శ్రీమానినీశుండు
సంతసంబు నిగుడ జలజభవుఁడు
వినఁగ నొక్కమాట విస్మయంబుగఁ బల్కె
మమ్ము నీక్షఁ జేసి మహిమ మెఱయ.

103


సీ.

కలరు జగంబులో ఘనపాపయుక్తులు
       పుణ్యాత్ములగు మర్త్యపుంగవులును
నేపాతకంబున కేది కృత్యం బగు
       నాపాతకంబున కది యెఱింగి
యం దఘసంయుక్తు లగువారి నీక్షింప
       దండహస్తుఁడు గర్త మండలమున
మత్పాదభక్తిసామర్థ్యసంయుతు లెల్ల
       ధరణి సజ్జనులని యెఱుఁగవలయు
జాతిహీనులైన సత్కులోద్భవులైన
వేదవేదులైన వేరు లేని