పుట:మత్స్యపురాణము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

69


మ.

ధరణిన్ సర్వసుధాశనాహితచమూదర్పంబు వారింప సు
స్థిరలీల యదువంశసంభవుఁడనై చిత్రంబుగా గోపికా
తరుణుల్ గొల్వ భవద్వనాంతరములన్ దార్కొన్నహర్షంబుతో
నెరవై క్రీడ యొనర్చువాఁడ రమణీ నిత్యప్రభాతంబులన్.

34


క.

సిరి యలిగిన వచనములకుఁ
బరితాపము నొందవలదు పద్మానన యేఁ
దిరముగ నిల్చెద నీయం
దరయఁగఁ దత్పంకజాలయాసహితుడనై.

35


వ.

మఱియు నిన్ను జనులు తులసి యనియు, విష్ణుప్రియ యనియు, నమృతో
ద్భవ యనియు, ననురూపయనియు, మాధవి యనియు, వైష్ణవి యనియు,
కుండలి యనియు, మోహిని యనియు,శంఖిని యనియుఁ, బదప్రభ
యనియు, నారాయణి యనియుఁ, జక్రిణి యనియు నిట్లు ద్వాదశనామంబులం
కొనియాడి కలుషరహితులును వైకుంఠనివాసులు నగుదురని యాలక్ష్మీవల్ల
భుం డానతిచ్చినయంత వసుధాంశంబున నమృతకలశసంభవ యగు నా
తులసీలలామ జగంబులు పవిత్రంబులు సేయుకొఱకు నై తరురూపంబు దా
ల్చి నిజపుష్పదళంబుల విష్ణుకైంకర్యంబు సలుపుచుండెనని చెప్పి చతురాస
నుండు మఱియు నిట్లనియె.

36


క.

తులసీతరుసన్నిధి వి
ప్రులకును మృష్టాన్న మొసఁగు పుణ్యుఁడు సిరులన్
వెలయుచు మని తుద లక్ష్మీ,
లలనాధిపలోకసుఖములను గను ననఘా!

37


క.

తులసీతరుమూలంబున
జలములు పరిపూర్తినిడిన సజ్జనులు మహా
కలుషములఁ బాసి విభవం
బులఁ బొందుదు రాత్మబంధుపుత్త్రులతోడన్.

38


క.

తులసీమూలంబున ని
శ్చలభక్తిని విష్ణుపూజ సలుపు మహాత్ముల్