పుట:మత్స్యపురాణము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

65


యపరిమితం బైన బ్రహ్మానందసుఖం బుదయించిన దేహంబునం దాదరం
బు విడుచు దేహసమాగతసౌఖ్యంబులయందు విరక్తుం డైనట్టి మహాత్ముం
డు సాయుజ్యంబు నొందునని చెప్పిన విని నారదుం డిట్లనియె.

13


చ.

సరసిజనాభువక్షమునఁ జయ్యన నుండుటకాని లక్ష్మి త
చ్ఛిరమునఁ బాదుగా నిలిచి సేవ యొనర్పఁగఁ జాలదట్టిచో
హరికిని గంఠభూషణము లై మణికీలితకుండలంబు లై
సిరసున ధార్యమైన తులసీమహిమాతిశయంబుఁ జెప్పవే.

14


వ.

అనినఁ బద్మసంభవుండు మునివరున కిట్లనియె.

15


క.

సురలును నసురులు వారిధిఁ
దరువ సురాసింధురాశ్వతరుణీమణులున్
దరు లుదయించిన ధన్వం
తరి యంతట నమృతకలశధరుఁడై యొదవెన్.

16


క.

అయ్యవసరమున హరి యది
చయ్యన నీక్షించునంత సత్కుచములపైఁ
బయ్యెదఁ గీలించుచు నం
దొయ్యన నొకతరుణి వేడ్క నుద్భవ మందెన్.

17


క.

ఈనియతి నమృతకలశము
లోనం జనియించి రమణి లోకోత్తరు ల
క్ష్మీనాధుఁ గాంచి ఘనల
జ్జానతవదనాబ్జ యగుచు నభినుతి కెక్కెన్.

18


మ.

జలజాక్షుండును వేడ్కఁ జూచెను సుధాసంజాతనంభోజినీ
దళవిస్తారితలోచనన్ విమలహస్తం బక్వబింబాధరన్
బలభిన్మత్తకరీంద్రకుంభయుగళీప్రత్యాఖ్యవక్షోరుహన్
లలితాస్యన్ సుకుమారమూర్తిసహితన్ గాంతామణిన్ భ్రాంతిమై.

19


వ.

అంత నప్పరమపురుషుండగు లక్ష్మీవల్లభుండు తత్కాంతాదర్శనసంజాత
హర్షంబున నుప్పొంగి మనంబు సింజాసమంజీరకీలితనీలరత్నప్రభాపటల
శ్యామలితతత్పాదసరోరుహంబులయందును, బద్మరాగమణిమయం బగు
రశనాకలాపంబువలన సముద్ధితంబగు తేజఃపుంజంబుచేత రంజితం బై