పుట:మత్స్యపురాణము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

43


వరుస జీవులు కర్మవాసనాసహితు లై
       యెడఁ గని రేణు లై యడఁగి యంత
నా వసుంధర లయం బందు కాలంబునఁ
       దద్భూమితోడ నత్యంతలయముఁ
బొంది క్రమ్మఱను నుద్బుద్ధమై జగములు
       వివిధంబు లై సంభవించు నపుడ
యట్టి జీవులు తద్వాసనావృతాత్ము
లగుచుఁ గర్మానురూపదేహములఁ బొంది
భోగవశులయి సంసారసాగరమున
సంచరింత్రు పూర్వజనిసంస్మరణం దొలఁగ.

41


వ.

మఱియును.

42


సీ.

జలదముల్ బాలభాస్కరతేజ మణఁగించి
       బలిమితోఁ జుట్టి పైఁబర్వి మఱియు
నత్యుష్ణతద్భాస్కరాధికకరజాల
       కాంతు లెచ్చిన విచ్చి కలఁగునట్లు
జ్ఞాన మజ్ఞానసంఛాదితరూప మై
       తద్వికారంబు నధఃకరింప
శక్తంబు గాక సంశయసమాసక్త మై
       యదియె సత్తామాత్ర మై చెలంగు
నంతఁ దనుఁ దానయజ్ఞదానాభిషేక
విష్ణుసంస్మృతిపూజాదివిధులచేత
నట్టి సుజ్ఞానదీపకం బధిక మగుచుఁ
గణక నజ్ఞానతిమిరంబు నణచుఁ దనయ.

43


క.

జ్ఞానం బొదవినయప్పుడె
మానవులు గతాఘు లగుచు మఱి దేహములన్
బూనిక ధరియింపక ని
త్యానందపదప్రవిష్టు లగుదురు పుత్త్రా.

44