పుట:మత్స్యపురాణము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

27


దము సృజించిన రమాధవునిపైఁ జిత్తంబు
        ననుకొల్పి సుజ్ఞానసహితు లగుచు
బాహ్యవస్తుమోహభావంబు విడనాడి
కామమదము లందుఁ గట్టువడక
ముదముతోడ నెనసి ముక్తు లై తద్విష్ణు
దీప్తిఁ గలసి చనిరి ధీవరేణ్య!

126


వ.

ఇట్లు పుండరీకాక్షు మనస్సృష్టినిర్మితు లై లోకత్రయంబునం గలుగు నాగ
మనుష్యసురేంద్రాదులు భక్తియోగంబున ముక్తు లై తన్నుం గలిసిన.

127


గీ.

మఱలఁ బురికొనంగ మజ్జనకుం డగు
భగవదాఖ్యుఁ డైన పరముఁ డాది
విష్ణుమూర్తి నన్ను వీక్షించి ముదమునఁ
బలికెఁ గూర్మి మెఱయ భవ్యచరిత!

128


సీ.

ఇలలోన ఖగమృగాదులు నిజాంశమ్ముల
        మించ సర్గంబు నిర్మించలేక
వైరామబంధప్రవర్తనంబుల నవి
        సమసెఁ గాలంబున సత్వ ముడిగి
నరదేవనాగకిన్నరముఖ్యు లెల్లను
        హృదయముల్ మిక్కిలి పదిలపఱచి
మత్పాదభక్తి మై మఱగంగ నడుకొల్పి
        మఱి యన్య మెఱుఁగక మాన్యు లగుచు
జలము లెల్లను జలరాశిఁ గలయునట్లు
యత్నమున మత్సముద్భవు లగుటఁ జేసి
వారు బాహ్యప్రపంచసంచార ముడిగి
క్రమ్మఱను మమ్ముఁ గలసిరి కంజనిలయ.

129


క.
పాయక యి ట్లఖిలము మ

త్సాయుజ్యము నొందు నంత సకలజగంబుల్ శ్రీయుతము లగుచు శూన్యము

లై యున్నని తమముచేత నాశాంతములై.
130