పుట:మత్స్యపురాణము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

మత్స్యపురాణము


గీ.

సంతతానపాయసంపత్కరంబును
సకలధర్మములకు సాధనంబు
దేవమిళితమత్పురావాసహేతువు
కృతము నదియ సుగుణకీర్తనంబు.

113


వ.

మఱియు శిలాదారుమయంబు లైన ప్రతిమావిశేషంబులు నిల్చి యందు
మదీయాకారంబు భావించి పూజాదిక్రియ లొనర్చుటయు మత్ప్రీతిగా య
జ్ఞంబు లాచరించుటయు మదర్పితంబులుగ దీనులయెడ దానంబులు సేయుట
యును బుణ్యతీర్థంబుల యందు స్నానంబును దీర్థయాత్రయు మొదలైనయవి
జ్ఞానంబునకుఁ గారణంబులు. అట్టి సుజ్ఞానసమేతుండైన మద్భక్తుండు బా
హ్యవస్తు మోహంబుఁ బరిత్యజించి ధ్యానయోగంబున స్వసంమేధ్యసుఖం బ
నుభవించుచు నాత్మారాముండై వర్తించునట్లు గావున నిత్యనైమిత్తికకా
మ్యనిషిద్ధకర్మంబులఁ ద్యజించి.

114


చ.

వరుస మదీయదాసజనవర్గములోపల నగ్రియుండవై
సురనరనాగలోకములు చొచ్చి విశేషములైన ఠావులం
దిరుగుచు మద్గుణాకలితనిర్మలగీతములెల్ల వైణిక
స్వరముల గానముల్ సలుప సంతసమందుదు నేను భూసురా.

115


వ.

అని యీచందంబున లక్ష్మీవల్లభుం డాన తిచ్చి తొల్లిటి యట్టివిగ్రహంబు ధ
రియించి సువర్ణవేదికామధ్యంబున నిలిచె. నంత నారదుండును బహ్మానంద
సంపన్నుండై యాపుండరీకాక్షవిగ్రహంబునకుఁ బ్రణామం బాచరించి జీవన్ము
క్తుండై హరినామస్మరణంబు సేయుచు విష్ణుభక్తిపరిపూరితాంతరంగుండై క
ర్మయోగంబుఁ బరిత్యజించి జ్ఞానమార్గంబున సంచరించుచునుండె నని నారా
యణమునాంద్రుఁ డీప్రకారంబున నారదుజన్మవృత్తాంతంబు సెప్పిన విని శౌ
నకుం డిట్లనియె.

116


క.

వేదానధికారులకును
మోదంబున నాచరింప ముఖ్యము లగు త
ద్వేదోక్తము లగు కర్మము
లాదరమున నాన తిమ్ము హర్షం బొదవన్.

117