పుట:మత్స్యపురాణము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

141


సీ.

వినుము కుమార యీవిశ్వంబులోపల
        ధరణితలాకాశగిరులయందు
వార్ధినదీద్వీపవాయుతేజములందు
        ధరణీరుహోదకస్థలములందుఁ
బశుపక్షిమృగకీటపన్నగంబులయందు
        వసుధానిలింపదేవతలయందు
ఫలపుష్పపల్లవపరిమళాదులయందు
        విమలకాంచనరత్నసమితియందుఁ
దిలలయందును దైలంబు నిలుచుమాడ్కి
సర్వవరిపూర్తితోడుత సంక్రమించి
నెలయుచుండును వేదాంతవేద్యుఁ డైన
విష్ణుఁ డఖిలాండమధ్యప్రవిష్ణుఁ డగుచు.

58


క.

ఆపరమమూర్తి వరనా
భీపద్మమునందు నేను బృథుతరభక్ష్యా
రోపితనిజహృదయుఁడ నై
చూపట్టితి సంభవించి సురలు నుతింపన్.

59


క.

నిలిపితిని సర్వజనములఁ
దలకొలిపితి నందుఁ జెడని ధర్మము మిగులన్
గలఁచితి నసురుల హృదయము
లలయించితి విష్ణువిముఖు లగు దుర్జనులన్.

60


వ.

మఱియు నప్పరమపురుషుం డైన లక్ష్మీవల్లభుండు త్రిజగత్సంపూర్ణుం డై
కర్మాచారసమేతు లగు మహీసురులచేతఁ గ్రతువులయందు శ్రౌషడ్వౌష
ట్స్వధాస్వాహాంతంబు లైన మంత్రంబులచేత నాహూయమానుం డై తద
గ్నులయందు హుతంబు లైన పురోడాశాదులు భుజియించి క్రతుకర్తలకు
వాంఛితంబు లొసంగుచు నతిగహనంబు లగు సంసారంబు లందుఁ బుత్త్ర
ధనవధూపశుబాంధవగృహాదిదుర్మోహంబులం బరిత్యజించి ప్రపన్ను
లైన దాసులచేత ననవరతంబును హృదయపయోరుహంబులయందు
ధ్యేయుండై తద్ద్వైగుణ్యంబులు దలంపక వారికిం బరమపదంబు గృప