పుట:మత్స్యపురాణము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

135


నుపవసించి మఱి పూజాపూర్వకంబుగా జాగరణంబు దీర్చి మఱునాఁడు త
ద్విప్రునకుఁ గందమూలాదులు సమర్పించి తద్వీఘనంబునఁ దాను బారణ
సేసినపిమ్మట నవ్విప్రుండు తృప్తినొంది దీవించి చనియె. నంత పదియాఱవ
దినంబున నేకాదశి వచ్చిన విధ్యుక్తప్రకారంబున నాసాధ్యి వ్రతంబు సలు
పుచున్నంత.

29


గీ.

అచటి కొక్కవిప్రుఁ డధ్వపరిశ్రమం
బునను జేరి కందమూలఫలము
లాఁకటికి దగంగ మాకు నొసంగంగ
వలయు ననుచు నతఁడు పలికె నంత.

30


మ.

విని యవ్వాక్యములన్ సుగంధి పలికెన్ విప్రేంద్ర నిన్నజ్ఞతన్
జనువాఁ డందును బల్కరాదు గమనశ్రాంతుండవై యున్నచో
దినముల్ సూటి నెఱుంగవైతివొ ననుం దీవ్రంబుగా మాయగొ
ల్పను నుద్యోగము నీమదిం బొడమెనో పల్కంగ నింకేటికిన్.

31


క.

ఆకంజాక్షుని దివసం
బేకాదశి నేఁడు ఫలము లెట్లు భుజింపన్
గైకొనఁ దివిరితి విఁక నీ
వాకలుషము లాత్మఁ గానవైతివి విప్రా!

32


క.

హరిదినమున నన్నము భూ
సురులకు నిడువారు విగతసుకృతంబున దు
ష్కరసంచితాఘములచేఁ
బరవశులై చనరె యముని భవనంబునకున్.

33


గీ.

వృద్ధరోగబాలవిపశాంగులక కాని
యన్యజనుల కెందు హరిదినమున
నన్నమిడినవారు నన్నాభికాంక్షులు
చనెడువారు యముని సదనమునకు.

34


వ.

అని యిట్లు విప్రభామిని యగు సుగంధి హాసపూర్వకంబుగాఁ బలికినవచ
నంబులకు రోషాయత్తమనస్కుండై యాధరామరుం డిట్లనియె.

35


చ.

అతివవు గాన నీ వెఱుఁగ వంత తలోదరి యీవనంబునన్
వెతకఁగ సాక్షి చెప్ప నొకవిప్రుఁడు నైనను లేఁడు నిన్ను నే