పుట:మత్స్యపురాణము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

123


వల్లభుండు భక్తియోగమార్గంబుననె ప్రసన్నుండై భక్తులకుఁ బరమపదం
బుఁ గృపసేయు. నీయుపాఖ్యానంబు వినినం బఠించిన లక్ష్మీకాంతునిలోకంబు
న నిలయంబు కలుగునని చతుర్ముఖుండు సెప్పి నారదునకు మఱియు నిట్లనియె.

151


సీ.

తెలియుము మదిలోనఁ దిరముగా విష్ణుండు
        పరతత్వ మనుచును భక్తిఁ బొదలి
నుడుగుము భక్తితో నెడపక తద్రమా
        కాంతుసద్గుణములు కౌతుకమునఁ
దలఁపుము హృదయపద్మంబునఁ గమలేశు
        నామపంజరము సన్నాహ మొదవ
వినుము వీనులయందు మునుకొని కౌస్తుభా
        భరణుని కథలు సంభ్రమము నిగుడ
వందనము సేయు మాచార్యవర్యవిప్ర
పరమవైష్ణవమార్గప్రపన్నులకును
జేరఁబోవకు నచ్చోట వారిజాక్ష
మతవిరోధకులైన దుర్మతుల ననఘ.

152


క.

ఈవైష్ణవధర్మంబులు
భావంబునఁ దెలిసి విష్ణుభక్తినుతుఁడ వై
కావింపుము సత్కృత్యము
లావనజాక్షుం డొసంగు నఖిలార్థంబుల్.

153


సీ.

ఆచార్యవైముఖ్య మాత్మప్రశంసయు
        విష్ణుభక్తులఁ జూచి విరసపడుట
తత్ప్రయోజనములు తప్పించి నడచుట
        పరులలాభంబులు చెఱుపఁజనుట
గర్వంబు నొందుట కపటంబు సలుపుట
        మాయయు మోహంబు మత్సరంబు
పాదతీర్థము నేలఁ బడఁగ నంకించుట
        హరిమందిరము చేర నరుగకుంట