పుట:మత్స్యపురాణము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

చతుర్థాశ్వాసము


క.

ఆజిని రిపుల జయించుట
భూజనవిభుఁ డార్తతతులఁ బోషించుటయున్
రాజులకు నివియె ధర్మము
లీజగము పరిగ్రహింప హితజనవినుతా.

57


వ.

మఱియును.

58


సీ.

సత్యంబు విడువక సామర్థ్య ముడుగక
        సంతతాచారనిస్తంద్రుఁ డగుచు
భావంబులోపల బదిలుఁడై ధనధాన్య
        కులరూపపదములు గుట్టుపఱిచి
పరమదయారసప్రఖ్యాతుఁడై నిత్య
        నియమముల్ జరుపుచు నిర్వికార
మునఁ బ్రవర్తించుచుఁ దనయకళత్రాది
        మోహజాలంబున ముణుఁగువడక
మోక్షగమనసరణి వీక్షింపఁగోరుచు
స్వప్నరూపమైన సంసృతిగతి
చనఁగ నేర్చునతఁడు చర్చింప సద్గురు
బోధ్యుఁ డనఁగఁబఱఁగు భూమిలోన.

59


వ.

మఱియు నేతద్గుణసమేతులైనవారు జ్ఞానాధికారులై యంకురితలును, బుష్పితు
లును, ఫలితులు ననఁ బ్రవర్తింతురు; అందు మోక్షధర్మాపేక్షు లంకురితులును
దదాచారనిరతులు పుష్పితులును జీవన్ముక్తులు ఫలితులు నగుదు; రిట్లు త్రివి
ధప్రవర్తునులకు గురుముఖసంబోధితంబగు జ్ఞానంబున మోక్షంబు గలుగున
ని చెప్పి కపిలుండు మఱియు నిట్లనియె.

60


సీ.

దయయు సత్యంబును దాక్షిణ్యమును లేక
        రాజ్యగర్వంబున రాణ మెఱసి
పరసతిపశుధనభ్రాంతచేతస్కులై
        పుత్త్రదారేషణస్ఫూర్తిఁ బొదలి
ప్రజలఁ బీడించుచుఁ బాపసంయుక్తులై
        బ్రాహ్మణగురుదేవభక్తి విడిచి