పుట:భీమేశ్వరపురాణము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 73


శా.

కాశీస్థాననివాసులన్ యతులభిక్షావృత్తులం గాంచి పా
రాశర్యుం డెటఁ బోయె నంచు నడుగం బ్రహ్మావిహీనాత్మకుం
డాశుంకుం డెటఁబోయెనో యెఱుఁగ మయ్యా మీరు పోపొండు వి
శ్వేశద్రోహి నెఱుంగ నేమిపని వాఁ డెచ్చోటికిం బోయెనో.

10


వ.

అని సత్యవతేయుండు చేసిన యపరాధంబు తేటపడం జెప్పిన.

11


తే.

కూడు పెట్టక యెన్నాళ్లు కుతిలపఱచి, గాసిసేయుట యిది తప్పు గాదె తనకు
నెదురు కదు రేల కోపించె నిందుధరుఁడు , అకట గ్రుడ్డెఱ్ఱ బాదరాయణునిమీఁద.

12


క.

ద్వైపాయనముని వెడలం, ద్రోపించిన కోపగాఁడు ధూర్జటి యీకా
శీపతి మనలను ననుకం, పాపరుఁడై యిచట నేల బ్రతుకఁగ నిచ్చున్.

13


వ.

కృష్ణద్వైపాయనుతోడిద లోకంబు గాక యనుచు నమ్మునిలోకంబు కాశికానగరంబు వెలువడి శాఖోపశాఖల నతని చొప్పుపట్టికొని దక్షారామంబు ప్రవేశించి.

14


తే.

తీర్థయాత్రాక్రమంబులు తెలియలేక, నారదుండు నానాపురాణజ్ఞుఁ డగుట
నతనిఁ బూజించి యందఱు నడిగి రప్పు, డత్రిజమదగ్నిభృగువసిష్ఠాదిమునులు.

15


మత్తకోకిలము.

నీ వెఱుంగనితీర్థముల్ ధరణీతలంబున లేవు స
ద్భావ మొప్పఁగఁ జెప్పు దైవత, తాపసోత్తమ తీర్థయా
త్రావిధానము దక్షవాటికథాక్రమంబును సప్తగో
దావరప్రథిమంబు భీమసదాశివోద్భవు లీలయున్.

16


వ.

అని యడిగిన నారదుం డిట్లనియె.

17


తే.

అఖిలతీర్థోత్తమోత్తమం బనఘులార, పావనం బైనసప్తగోదావరంబు
తనకుఁదాన మహానదీతటమునందు, నెలమినున్నాఁడు భీమేశ్వరేశ్వరుండు.

18


తే.

సప్తగోదావరంబు నిర్ఝరమనంగ భీమనాథేశ్వరస్వామి వేలుపనఁగ
ధర్మపరులార శబ్దభేదంబ గాని, యర్థభేదంబు లేడు పదార్థసరణి.

19


తే.

విమలమతి సప్తగోదావరమునఁ గ్రుంకి, సప్తసప్తిప్రతిష్ఠఁ బ్రసన్నుఁడైన
భీమనాథేశ్వరేశ్వరస్వామిఁ జూచు, మనుజులకుఁ బాయు సప్తజన్మములయఘము.

20


వ.

సప్తగోదావరస్నానమంత్రద్వయశ్లోకములు.

21


శ్లో.

సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమమ్
అత్రసన్నిహితో రుద్రో భీమనాథేశ్వరేశ్వరః.

22


శ్లో.

నమస్తే భీమనాథాయ, సప్తగోదావరాంభసే
పాపేంధనాగ్నయేతుభ్యం, నిమజ్జామి హర త్వయి.

23


ఉ.

ఆతతభక్తిభావమున నాదియుగంబున సప్తసంయము
ల్గౌతమముఖ్యు లైందవకళాధరు భీమయదేవు భక్తివి