పుట:భీమేశ్వరపురాణము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 31

ననుగుంబాసెముతోడఁ బొండుకలమాహారంబుతో నేతితో
ఘనరంభాషలఖండశర్కరలతోఁ గారుణ్యపాథోధికిన్. 67

తే. ద్వాదళాక్షరదివ్యమంత్రమునఁ బూన్చెఁ, జెంగలువ పువ్వుదండ లక్ష్మీధవునకు
శ్రీమదష్టాక్షరమున నర్చించెఁ దపసి, భావనారాయణస్వామిఁ బసిఁడివిరుల. 68

వ. అనంతరంబ కతిపయప్రయాణంబులం దుల్యభాగాతీరంబున. 69

శా. చేతోమోద మెలర్పఁ గట్టెదురఁ గాంచెన్ భారతామ్నాయ వి
ద్యాతంత్రగ్రథనాబ్జసంభవుఁడు వేదవ్యాసుఁ డభ్యర్హిత
జ్యోతిర్లింగమయస్వరూపుల జటాజూటావనార్దేందులన్
వాతాపీల్వలవైరి గౌతమనదీవాస్సంగమేశానులన్. 70

తే. వేదశాఖావిభాగసంవేది యతఁడు లలితబిల్వశాఖాపలాశసమితి
సంగమేశఘటోద్భవశంకరులకు, నర్చనము సేయుఁ బ్రణవపంచాక్షరముల. 71

వ. మఱియుఁ దుల్యభాగాతీరంబున సాంపరాయణగ్రామంబుచేరువ బిల్వాటవీ వాటిఁ
గపట భిల్లుండైన చలిగొండ ఱేని యల్లుని ముక్తీశ్వరు దర్శించి. 72

ఉ. వేదవిభాగముం బరిఢవించిన పుణ్యుఁడు వేడ్కఁ బూన్చె బి
ల్వీదళపూజనంబు గడులెస్సఁగఁ గూరిమిశిష్యపంక్తితో
నాదిమభిల్లు నిత్యకరుణామృతపూరముఁ జల్లు పుండరీ
కోదరభల్లు నృత్తకరియూథపుమల్లునిఁ గొండయల్లునిన్. 73

తే. పదియునార్వన్నెబంగారుఁ బరిహసించు, నవనవారగ్వధప్రసూనములు గోసి
సాంపగాయమహాగ్రామసవిధనిలయు, నభవుఁ బూజించెఁ బుండరీకాక్షమూర్తి. 74

క. పంచబ్రహ్మంబుననున్, బంచాక్షరమంత్రమునను బంచాననునిం
బంచమవేదం బభినిర్మించినముని ఫూన్చెఁ బుండరీకకళికలన్. 75

వ. ఇవ్విధంబునఁ గాలకంఠునకుఁ బ్రభాతకాలపూజ నిర్వర్తించి సాత్యవతేయుండు గమనోన్ముఖుండై యున్న సమయంబున. 76

సీ. ఎవ్వాఁడు వింధ్యాద్రి నిఱ్ఱింకులింకించె, గంభీరహుంకారగర్జనమునఁ
బ్రణవపంచాక్షరోపనిషత్ప్రపంచంబు, లెవ్వాఁడు శివునిచే నెఱిఁగికొనియె
గడసిల్లుధరయొడ్డ గెడవైన నెవ్వాఁడు, త్రాసుపైఁ గట్లెచందమున వంచె
నంభోదు లేడింటి నాపోశనం బెత్తి, కలిగించె నెవ్వాఁడు క్రమ్మఱంగ
తే. భీమనాథేశ్వరుఁడు గౌరిఁ బెండ్లియాడి, దక్షిణాముఖకల్యాణదర్శనమున
వత్సరము వత్సరంబు నెవ్వానిఁ జూచు, నతఁడు గగనాగ్రమాణిక్య మరుగుదెంచె. 77

తే. మలయదుర్ధరగిరిగుహామందిరుండు,
తామ్రపర్ణీజలస్నాన ధౌతమలుఁడు