పుట:భీమేశ్వరపురాణము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

శ్రీ భీమేశ్వరపురాణము


తే.

తుల్య భాగాతరంగిణి తోడఁగూడఁ, గణ్వవాహినితోఁ గూడఁ గనకరత్న
దివ్యపరిధానసహితంబు దేవభర్త, ధరణి భీమేశ్వరున కిచ్చె ధారపోసి.

78


తే.

దాత త్రైలోక్యభర్త వృద్ధశ్రవుండు, దేయ మంభోధిగౌతమీతీరభూమి
త్రిపురవిధ్వంసనుండు ప్రతిగ్రహీత, యింత యొప్పునె పరికింప నీ సమృద్ధి.

79


వ.

ఇవ్విధంబునఁ బాకశాసనుండు పురశాసనుం డగుశ్రీభీమేశ్వర శ్రీమన్మహాదేవునకు నంగరాగాదిభోగవైభవవినోదార్థంబుగా గజాశ్వదాసదాసీగాణిక్యమాణిక్యగోధేనుసహితంబుగా భీమమండలంబు దక్షారామసమేతంబుగా సమర్పించి చాతుర్వర్ణ్యంబును రప్పించి యిట్లనియె.

80


సీ.

ఓమహాజనులార భీమమండలమహా, గ్రామఖండికభట్టి కాద్రజైక
వాస్తవ్యులార విశ్వాసపూర్వకముగా, సావధానమనస్కులై వినుండు
ప్రాగ్దిశకును యామ్యపశ్చిమంబులకును, నంభోధిగౌతము లవధిచిహ్న
లుత్తరమున మూఁడుయోజనంబుల తుద, పొలిమేర యిది చక్రవలయరేఖ


తే.

యీమహాక్షేత్ర మేను సర్వేశ్వరునకు, నిందుధరునకు దక్షవాటీశ్వరునకు
నిచ్చితిని ధారపోసి భీమేశ్వరునకు, నాసుధాకరతారకాహస్కరముగ.

81


ఆ.

ఏలుకొండ్రు మీర లేపురాంతకునకుఁ, బృథివియీగి బిడ్డ బిడ్డతరము
బ్రతుకుఁ డాశ్రయించి ఫణిరాజకుండలు, భీమనాథదేవు భూమిజనులు.

82


వ.

అని యీప్రకారంబునఁ దెల్పుడు సేయుదు.

83


చ.

సురపతి మార్గశీర్షమున శుద్ధచతుర్ధశినాఁడు రోహిణిం
బొరసిన సిద్ధయోగమున భూతలమిచ్చెఁ బయోధిగౌతముల్
గరుసుగఁ దుల్యభాగయును - గండ్రెడు లోనుగ దక్షవాటికా
వరువకు భీమనాథునకు వారవధూత్రిశతద్వయంబుతోన్.

84


వ.

ఇట్లిచ్చి ధర్మశాసనంబు వ్రాయించె నది యె ట్లనిన.

85


ఉ.

ఇప్పటి భూమిపాలురును నింకిట రాఁగల భూమిపాలురుం
దప్పకుఁడయ్య మత్ప్రవిహితస్థిరభూతలదానధర్మ మె
ల్లప్పుడు మీకు నయ్యెడుఁ జిరాయువు భాగ్యము వైభవంబుచే
నొప్పగు సుప్రతాపము సుఖోన్నతి గంధగజాదిలక్ష్మియున్.

86


వ.

అని వెండియు.

87


సీ.

కట్టించెఁ బట్టనక్ష్మావిభాగము పైఁడిఁ, గల్పించె వప్రంబుఁ గాంచనమున
మలిపించె బంగారముల దేవగృహములు, కూర్పించె నట్టిండ్లు కుందనమున
నిరించే బ్రాసాదనివహంబు గనకానఁ, బాటించె గవఁకులు హాటకమున
రచియించెఁ గార్తస్వరమున గోపురములు, కీలించెఁ గేలిదీర్ఘికలు భూరి