పుట:భీమేశ్వరపురాణము.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

శ్రీ భీమశ్వరపురాణము


వ.

అనంతరం బాశివుం డభ్యంతరమందిరంబునఁ బ్రవేశించి హరివిరించిప్రముఖబృందారకులచేత మధుపర్కాద్యుపచారంబులు గైకొని కక్ష్యాంతరంబులు గడచి గర్భగృహమండపంబునందు నూత్నరత్నస్వరూపంబైన శ్రీభీమనాథ మహాదేవ స్వయంభూజ్యోతిస్సుధామయమహాలింగంబు నాగమోక్తప్రకారంబుల నర్చించి యాపాదమస్తకంబు తద్రూపంబు ముహూర్తమాత్రంబు చింతించి.

48

శ్రీకంఠుఁడు దక్షారామభీమేశుతో నైక్యతం బొరయుట

శా.

కైలాసాచలకేలిమందిరుఁడు శ్రీకంఠుంండు సోత్కంఠుఁడై
ప్రాలేయాచలరాజకన్యకయుఁ దా బ్రహ్మాదిదేవవ్రజం
బాలోకింపఁగ నైక్యతం బొరసె దక్షారామభీమేశుతోఁ
ద్రైలోక్యంబును దివ్యలింగశివతాదాత్మ్యంబు వర్ణింపఁగన్.

49


సీ.

అవ్యయం బనవద్య మాద్య మచ్యుత మజం,బవ్యక్త మప్రమేయం బనంగఁ
బరఁగి కైలాసభూధరసమాగతమైన, తేజంబుతోఁ గూడి తేజరిల్లె
దక్షవాటీపురాధ్యక్ష భీమేశ్వర, శ్రీస్వయంభూదివ్యసిద్ధలింగ
మమృతపాథోధిమధ్యాంతస్సముద్భూత, మమలపరంజ్యోతిరాదికంబు


తే.

భువనబీజంబు కైవల్యభోగదాయి, యఖిలకళ్యాణకారి విశ్వాద్భుతంబు
పూజఁ గొనియెను మురభిదంబుజభవాది, దేవతాకోటిచే సంప్రతిష్ఠఁబొంది.

50


వ.

బ్రాహ్మీప్రధానసప్తమాతృకలను నందీమహాకాళాదిప్రమథగణంబులును హరివిరించిప్రముఖబృందారకులును బురందరాదిలోకపాలకులును వసురుద్రాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినీదేవతలును సిద్ధసాధ్యులును విద్యాధరోరగులును గ్రహనక్షత్రతారకంబులును బితృగణంబులును మూర్తంబులును నమూర్తంబులు నగుచరాచరంబులన్నియు నానారత్నగంధపుష్పధూపదీపనైవేద్యాదులు సమర్పించి ప్రదక్షిణంబు లాచరించి నమస్కరించి నుతియించిరి. తదనంతరంబ వెండియు.

51

లక్ష్మ్యాదులు శ్రీభీమేశుని స్తుతించుట

క.

సిరివాణిగౌరిసతియ, ప్సరసలరుంధతియహల్యశచిమొదలగు స
త్పరమపతివ్రత లర్చిం, చిరి దక్షారామనిలయు శ్రీభీమేశున్.

52


వ.

ఇట్లు పూజ చేసి పరమపతివ్రతలు ముకుళితకరాంబుజలై శ్రీదక్షవాటీపురాధ్యక్ష భీమేశ్వర భీమనాథ భీమశంకర భీమలింగ మహాదివ్యలింగ యవాఙ్మానసగోచర సనకసనందనసనత్కుమారసనత్సుజాతాదియోగీంద్రులు నపారంబైన నీమహిమఁ గొనియాడనేర, రటుగావున మిమ్ము స్తోత్రంబు సేయ మాబోంట్లతరంబె? నిర్గుణుండవు సగుణుండవు గుణాతీతుండవు గుణాఢ్యుండవు నీ వొక్కగుణంబున