పుట:భీమేశ్వరపురాణము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

శ్రీ భీమేశ్వjపురాణము


వ.

అంత నీలకంఠుఁడు పురోపకంఠంబునకు విచ్చేయునప్పుడు.

27


గీ.

విషమకఠిన నిన్ను వీథీవిటంకంబు, నంతరాంతరముల నరసియరసి
యక్షకర్దమమున యక్షేశ్వరాదులు, సవరచేసి రధికసంభ్రమమున.

28


క.

ఘుసృణప్రసూనరసమునఁ, బసపుంజూర్ణమునఁ జంద్రపాంసులముక్తా
విసరముల సుర లొనర్చరి, పసగా శంఖాబ్జముఖ్యబహుచిత్రంబుల్.

29


వ.

వెండియు సువర్ణారవిందసందానితసుందరమందారమాలికాభిరామంబును సంస్తంభితశాతకుంభదండమండితధ్వజోపశోభితంబును నానావిపణిమార్గన్యస్తసంఘటితమాణిక్యమయూఖరేఖాకిమ్మీరితదశదిశాముఖంబును వరివిశేషవిభవలక్ష్మీధామంబును నగుదక్షారామంబుఁ బ్రవేశించునప్పుడు.

30

శివుఁడు దక్షారామంబుఁ ప్రవేశించుట

ఉ.

అక్షతగంధపుష్పఫలహారిహిరణ్మయపాత్రహస్తలై
దక్షాపురీవిలాసినులు తామరనాయతలోచనల్ సహ
స్రాక్షుఁడు భీమలింగమున కర్పణచేసిన యప్సరల్ విరూ
పాక్షు నెదుర్కొ-నం జనిరి యందియ లంఘ్రుల ఘల్లుఘల్లనన్.

31


తే.

భావహావవిలాసవిభ్రమము లమరఁ, జంద్రశేఖరు నగరి యచ్చరలపిండు
తగ సమర్పించె నయ్యాదిదంపతులకు, రత్నదీపాంకురముల నీరాజనములు.

32


ఉ.

శైలతనూజ తోడుగఁ బ్రసాదగుణంబున మాటిమాటికిన్33
మేలములాడుచున్ నిజసమీపమునన్ గుహమాతృభద్రశుం
డాలముఖప్రధానగణనాథులు గొల్వఁగ భారతీశల
క్ష్మీలలనేశ్వరుల్ గదిసి చెప్పెడు విన్నప మాలకించుచున్.


తే.

భూమి దక్షిణపాథోధిపుణ్యసీమఁ, బ్రజలు చేసిన భాగ్యవైభవసమృద్ధి
శ్రీమహాదేవుకరుణానిరీక్షణంబు, గౌరిముఖరాజలక్ష్మియుఁ గానఁబడియె.

34


శా.

సంతోషించిరి దక్షిణాపథజనుల్ సాక్షాాద్విరూపాక్షునిం
గాంతాసంయుతు నందివాహు శశిరేఖాజూటకోటీరు వే
దాంతాభ్యర్చితపాదపంకజుని దక్షారామమధ్యంబునం
దంతన్ సంభృతసౌఖ్యుఁ గంటిమిదె కన్నారంగ నం చెంతయున్.

35


క.

నాగేంద్రకర్ణకుండలు, నాగేంద్రత్వక్కటీరు నగరాజసుతా
సౌగంధ్యలలితదక్షిణ, భాగుం గనుఁగొంటి మిట్టిభాగ్యము గలదే.

36


గీ.

అని సమస్తజనంబులు నభినుతింప, నల్లనల్లన వేంచేసె నంధకారి
దక్షవాటికఘంటాపఠంబునందు, హరిశతానందశక్రాది సురులు గొలువ.

37


వ.

ఇట్లు భీమేశ్వరసదనాంతరంబుం బ్రవేశించి.

38