పుట:భీమేశ్వరపురాణము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

శ్రీ భీమేశ్వరపురాణము


కొల్పి కఠినశమనశిరస్ఫాలనంబునం గట్టిన శ్రీపాదారవిందంబునం దాపించిన బిరుదుకటకంబున ఘటియింపఁబడి వెలుంగుయాదఃపతి మేదోమృతంబు జిడ్డున గడ్డుకొనిన పూషాదిత్యుపలువరుసయంతంబున నుప్పతిల్లు త్రుళ్లుమెఱుంగులు పెల్లుగ నుల్లసిల్ల విలసిల్లుచు విశ్వజగదుత్పత్తిగుప్తివిపత్తికారియగు పురారిం గనుంగొని జయజయశబ్దపూర్వకంబుగా సంస్తుతి యొనర్చి ముకుళితకరారవిందుడై. 9


తే.

బ్రహ్మవిష్ణుమహేంద్రాదిపరివృఢునకు, నద్రిరాజన్యకన్యాసమన్వితునకుఁ
బ్రమథగణభూతబేతాళపరివృతునకు, హరున కినుఁడు నమస్కార మాచరించె.

10


వ.

ఇట్లు ప్రణామానంతరంబున భాస్వంతుండు గౌరీకాంతునకు నిజాగమనప్రయోజనం బెఱింగించినం దదనంతరంబ.

11


ఆ.

ఇనునితోడిచెలిమి నిభరాజవదనుండు, విన్నపంబు చేసె విశ్వపతికి
నమృతమథనవేళ నావిర్భవుండైన, భుజగహారుఁ జూడఁబోద మనుచు.

12


సీ.

విఘ్నాధినాథుండు విన్నవించినమీఁదఁ, బర్వతాత్మజ విన్నపంబు చేసెఁ
బర్వతాత్మజ విన్నపం బొనరించిన, వెనుకఁ గ్రౌంచఘ్నుండు విన్నవించె
గ్రౌంచఘ్నుఁ డటు విన్నవించినయత్తఱి, మఱి విన్నవించెను మాతృగణము
బ్రాహ్య్మాదిమాతృవర్గము విన్నవించిన, వెండియు భూతముల్ విన్నవించె


తే.

నిందుధరునకుఁ గైలాసమందిరునకు, నభవ విచ్చేయు రవికిఁ బ్రియంబు గాఁగ
నమృతవారాశి నుదయించి యంధ్రభూమి, దక్షపురి నున్నయాదివ్యతనువుఁ జూడ.

13


వ.

అని యిట్లు విన్నవించిన విఘ్నేశ్వరునిమీఁది యనుగ్రహంబునను భవానిమీఁది కూర్మిని గుమారునిమీఁది ప్రేమానుబంధంబునను బ్రాహ్మ్యాదిమాతృగణంబుమీఁది ప్రీతిని భూతంబులమీఁది యాదరాతిశయంబునను భాస్వంతునిమీఁది సంతోషంబునను మధ్యమలోకగమనోద్యుక్తుండై హరివిరించులం జూచి మహాదేవుం డిట్లనియె.

14

మహాదేవుఁడు ప్రమథగణసమేతుఁడై దక్షారామమునకుఁ బోవుట

మ.

కలవారందఱు దక్షవాటిగమనోత్కంఠాసముత్సాహదో
హలు లైనారు సహస్రభానుఁడును నభ్యర్థించుచున్నాఁడు మం
గళదివ్యామృతలింగదర్శనమునుం గర్తవ్య మంధ్రక్షమా
స్థలికిం బోదమె యూసుపోకకు వినోదంబుల్ పరీక్షింపగన్.

15


తే.

పాయ కొకచోటఁ జదికిలఁబడఁగ నుండ, నైన ఫల మేమి యటు వినోదార్థ మరిగి
సంచరింతముగాక యీ జలజహితుని, ధర్మ మౌర్జిత్యమును బొంద దక్షపురిని.

16


వ.అని యానతిచ్చి యాక్షణంబ. 17