Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/679

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధనదానుజుఁ డగుదైత్యుని, మనమున విన్మయము గదుర మన్ననతోడన్
మనుజపతి గట్ట నిచ్చెను, దనుజులఁ గరుణించి సముచితం బగుపూజన్.

2663


చ.

అమృతకళాంశుతుల్య మగుహారము రాముఁడు సీత కిచ్చె నా
రమణి ధరింప నొల్లక కరంబులఁ దాల్చి నిజేశుఁ జూడ భూ
రమణుఁడు నింతిక న్నెఱిఁగి రాగముతో నగుఁ గాక యన్న న
క్కమలదళాక్షి వాయుజునికంఠమునం దగిలించె వేడుకన్.

2664


క.

ఆముక్తాహారంబున, నామారుతసూతి శారదాంబుదనిచితం
బై మెఱయుమేరుగిరిగతి, భూమవిహారమున జనులు పొగడఁగ నెగడెన్.

2665


క.

మందరధీరుఁడు రాఘవుఁ, డందఱఁ గరుణించి చూచి
హర్షామృతని
ష్యంది యగుప్రియము పలుకుచు, మందస్మితవదన మమర మఱి యి ట్లనియెన్.

2666


చ.

అనయము మీకతంబునఁ బ్రయాసము నొందక యొక్కమాత్రలో
వననిధిఁ గట్టి దాఁటి యనివార్యబలుం డగుపంక్తికంధరుం
దునిమితి నెల్లరాక్షసులఁ ద్రుంచితి మించితి నీజగంబునన్
నినిచితిఁ గీర్తి రాజ్యపదనిష్ఠితవృత్తిఁ దనర్చితిం దగన్.

2667


క.

నెఱినీతియు ధర్మంబును, మఱవక నాతోడికూర్మి మానక మర్మం
బెఱుకపడ నీక మతి నే, మఱక సుఖం బుండి యప్రమాదుల రగుఁడీ.

2668


వ.

అని హితోపదేశంబులు మఱియునుం జేసి మీమీదేశంబులకుఁ జనుం డని
యాలింగనప్రియాలాపమందస్మితకరుణాతరంగితకటాక్షవీక్షణాదుల సంభావించి
సుగ్రీవాంగదపవనసుతాదు లగుప్లవంగయూథపులను విభీషణాదిరాక్షసులను
జాంబవదాదు లగుభల్లూకనాయకులను వీడ్కొలిపిన వారలు కృతప్రణా
ము లై నిజనివాసంబులకుం జనిన.

2669


ఉ.

విశ్రుతకీర్తి యైనరఘువీరుఁడు ధర్మదయానయాదులం
బ్రశ్రయధైర్యశౌర్యగుణభాసురుఁ డై నిరపాయవృత్తి వ
ర్ణాశ్రమపాలనంబులు ప్రయత్నముతో నొనరించుచున్ [1]నమో
పాశ్రయుఁ డై జగత్త్రయనియామకశాసన మొప్పఁ జేయుచున్.

2670


సీ.

ధర్మార్థకామముల్ దమలోన నొండొంటిఁ, బెంపుసొంపార బాధింప నీక
పంచాంగమంత్రంబు పరిపాటి దప్పక, తగుమంత్రిపక్షపాతంబు గలిగి
[2]ప్రణిపాతముఖగుణకప్రథితప్రయోగంబు, సేయుచుఁ దత్ఫలశ్రీఁ దనర్చి
శక్తిసిద్ధత్రయసంప్రాప్తి భవ్యుఁ డై, విజితారిషడ్వర్గవిమలుఁ డగుచు
నంచితప్రవృద్ధి సప్తాంగముల మించి, చతురుపాయయుక్తి వితతి నొంది
యాతతవ్యసనములందు సంగతి లేక, యేలె ధరణి రాఘవేశ్వరుండు.

2671


మ.

నిరతిశయానుభావమును నీతియు ధర్మపదైకనిష్ఠయున్

  1. శమోపాశ్రయుఁ డై
  2. పణబంధముఖగతప్రథిత