Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

భూధరంబునఁ దనరారుభూతపతియుఁ, బోలె నత్తఱి రాక్షసపుంగవుండు
చారుహిమధామమండలసదృశ మైన, రథ మధిష్ఠించి వెనుకన రమణఁ గదలె.

2599


క.

శత్రుంజయనామక మగు, గోత్రాచలసదృశ మైనకుంజరపతి నా
మిత్రసుతుఁ డెక్కి కదలెను, సుత్రాముఁడపోలె విభవశోభితుఁ డగుచున్.

2600


క.

అందలము లెక్కి వానర, సుందరులు ప్రియంబుతో వసుమతీసుత నా
నందమునఁ గొల్చి చనిరి పు, రందరుసతిఁ గొల్చువిబుధరమణులుపోలెన్.

2601


చ.

అడవులలోనఁ గొండలఁ బ్రయాసము నాక సుఖైౌకలీలమై
నిడుమలఁ బొంది ధైర్యమున నెంతయు వంతల కోర్చి నేఁడు మా
కొడుకులు పుణ్యశీల యగుకోడలు నిమ్మెయి వచ్చి రంచుఁ జొ
ప్పడర మహీశుభార్యలు ప్రియంబున నేఁగిరి హృష్టచిత్త లై.

2602


క.

కర్ణాంతాయతనేత్ర సు, వర్ణసువర్ణోజ్జ్వలాంగి వరమణిభూషో
దీర్ణ యగుజనకనందన, కర్ణీరథ మెక్కి కదలెఁ గౌతుక మెసఁగన్.

2603

రామునియయోధ్యాపురప్రవేశము

వ.

అంతఁ బౌరులు యథోచితవాహనంబు లెక్కి పరివేష్టింప నాసన్నభృత్యులుం
బరిచారకులు నంతంతఁ జనుదేర విజయాదిమంత్రివర్గంబు సుగ్రీవాదివానరపరా
క్రమంబులు దనవలన వినుచుం జనుదేరఁ బురోహితవిప్రవర్గంబులు ముందటం
జన నుభయపార్శ్వంబుల గజారూఢు లై వాలితనయపవనతనయు లరుదేర రథా
ధిష్ఠితుం డగువిభీషణుండు చరమభాగంబున నడవ నెడనెడ ననేకాశీర్వాదంబులు
సేయువిప్రజనులవాక్యంబులు నిగుడ సేతుబంధనాదిప్రసంగంబులు సంకీర్తించు
వందిమాగధాదులస్తుతివచనంబులు బెరయ భేరీభాంకారంబులుఁ బటహపటు
ఘోషంబులుఁ గాహళబహుళరవంబులును దిక్కుహరస్పర్శిఢక్కానిక్వణంబు
లును మృదంగమంగళరవంబులును శంఖవిరావంబులును డోలికాధ్వానంబులు
ను గాంస్యమయతూర్యనిస్వనంబులు వివిధనాళీభేదారావంబులును మత్తసిం
ధురబృంహితంబులును జటులఖురపుటదళితధరాతలతురగహేషితంబులును
సర్పిస్యందననేమిధ్వనులును బ్రహృష్టసుభటోద్భటకలకలంబులును సందర్శనా
గతపురజనకోలాహలంబులును నొక్క టయి బోరుకలఁగ రఘునాథునిరథాగ్ర
భాగంబున వృద్ధపురంధ్రీవర్గంబు ముఖవిన్యస్తనవామ్రపల్లవాశ్వత్థకిసలయపూర్ణ
సువర్ణకలశహస్త లయి మంగళగానంబులు సేయుచు నడవ నంతంత దూర్వా
క్షతకుసుమలాజలు మీఁదఁ జల్లుచుం బౌరకామిను లరుగఁ దారాగణసహి
తుం డైనచంద్రుండునుఁబోలె విలసిల్లుచు రామచంద్రుండు నిజరాజధాని యగు
నయోధ్యానగరంబుఁ బ్రవేశించె.

2604


ఆ.

అంతఁ బౌరు లెల్ల ననక్కడ నక్కడ, సంతసంబు నొంది జలజమిత్ర
కులపవిత్రుఁ డైనకోసలేశ్వరుఁ జూడ, నరుగుదెంచి యతిరయంబుతోడ.

2605