Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

హరి మొదలైననాకపతు లందఱు సంతసమంది చూడఁగా
నరవరుఁ డుగ్రకోపభరణంబున దైత్యునురస్స్థలంబుపై
వెరవుగ దృష్టి నిల్పి పటుకవిక్రమ మొప్పఁగ నేసె నేసినన్
బరుసన నభ్రవీథి వెసఁ బర్వుచు మండుచు దుర్నివార మై.

2176


సీ.

విలయార్కమండలావిర్భావ మొదవంగ, సంవర్తపావకచటుల మగుచుఁ
గులిశమహాయుధకోటిసంకాశ మై, కాలదండాయుతాభీల మగుచుఁ
జటులచక్రసహస్రసన్నిభస్ఫురణ మై, రుద్రశూలోదగ్రరుచులు నిగుడ
నిర్ఘాతసంఘాతనిష్ఠురపాత మై, ఫణిరాజసముదాయభయద మగుచు
సప్తమారుతదుర్వారజపము గలిగి, దానవస్తోమహృదయసంత్రాస మొదవ
శతమఖుఁడు మొదలైనదిక్పతులు మెచ్చ, నతినిరర్గళ మైనబ్రహ్మాస్త్ర మడరె.

2177


మ.

 కులగోత్రంబులు గ్రుంగె నంబుధులు సంక్షోభించె నిద్ధాత్రియుం
జలనం బొందె హరిద్గజంబు లదిరెన్ సర్పాన్వయేశుండు ని
ట్టలమై యోర్వక వీఁగెఁ గూర్మపతి వ్రీడం బొందె సర్వంబు ని
ట్లు లయారంభముఁ జెందుమాడ్కిఁ దలఁకెన్ డోలాయమానస్థితిన్.

2178


వ.

ఉభయపార్శ్వములందు వసువులును ముఖంబునందు దహనతపనులును బక్షం
బులయందుఁ బవనుండును నడుమ రుద్రులును దేజరిల్ల సకలసురవందనీయంబు
ను సర్వసిద్ధసాధ్యగంధర్వపూజ్యమానంబును నిఖిలదానవమదాంధకారమా
ర్తాండమండలంబును గరిరథతురగపదాతిజీర్ణకాననదవానలంబును బరిఘప్రాన
ముద్గరాదిసాధనజీమూతప్రచండమారుతంబును బరిపంథిసేనాబహువ్యూహభే
దనంబు నగునద్దివ్యశరోత్తమంబు భూతంబులును సురలును జయజయధ్వనులు
సేయఁ జనుదెంచి యింద్రాదిదిక్పతులవజ్రాదిసాధనంబులం బగులనిరావణును
రస్స్థలంబు గాఁడి తదీయప్రాణంబులు గ్రోలుచుం బుత్రి యగుసీతనిమిత్తంబు వ
గచువసుమతికి రాక్షసాధము వధియించితి నని చెప్పం బోవుపగిది భేదించికొని
పాతాళంబు సొచ్చి నిమిషార్థమాత్రంబునం గ్రమ్మఱి రాముతూణీరంబు సొచ్చెఁ
దనంతరంబ.

2179


ఆ.

బ్రహ్మకులజుఁడైన రావణుఁ జంపిన, యఘము వాపికొనఁగ ననఘుఁ డైన
రాముఁ జెందె ననఁగ రభసంబుతో నస్త్ర, మడరి దొనయ చొచ్చె నంతలోన.

2180


శా.

రామాస్త్రక్షతరక్తధార లొలుకన్ రక్షోవిభుం డంత సు
త్రామోదంచితవజ్రభిన్న మగుగోత్రక్ష్మాధరంబో యనన్
భూమిం గూలె శరాసనంబు శిథిలీభూతత్వ మొందంగ ను
ద్దామాక్రందము సేయుచున్ విగళితాంతస్సారసంచారుఁ డై.

2181


మ.

ధరణీభూధరదిగ్గజాహిపతు లుద్యత్త్రాసు లై క్రుంగి రు
ద్ధురభీతిన్ హతశేషదైత్యగణముల్ దూలెం బ్రమోదించె వా