Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బృథులగతిఁ బఱపి రాముం, బ్రథనోగ్రుం బొదివె నిశితబహుబాణములన్.

2110


క.

సురవైరిసాంద్రబాణో, త్కరములచే మునిఁగి యొప్పె ధాత్రీపతి మే
దురమేచకజీమూతాం, తరితుం డగుభానుపగిదిఁ దత్క్షణమాత్రన్.

2111


చ.

పవనుఁడు తూలజాలములఁ బన్ను గఁ బాయఁగ వీచుచాడ్పునన్
జవమున మేదినీపతి నిశాచరబాణమహాపరంపరల్
తవిలి వినోది యై విరియఁ దట్టి యుదగ్రతఁ దేజరిల్లె నం
త విగతధూముఁ డై కనలు దావకృశానునిమాడ్కి నెంతయున్.

2112


శా.

ప్రత్యాలీఢవిశేషసంస్థితికళాపారీణత రాఘవుం
డత్త్యారూఢసమీకరాగమున నుద్యద్బాణజాలంబు లా
దైత్యాధీశునిమేన గ్రుచ్చిన సముద్దామస్ఫురత్ప్రాభవో
ద్వృత్త్యారంభమునన్ శిలీముఖము లుర్వీనాథుపై నించినన్.

2113


సీ.

సముదగ్రతరజయస్తంభంబు నా వింట, మించిననారి సారించి మెఱసి
కమలసంభూతాండగర్భగోళము నిండి, ఘనతదీయధ్వాన మినుమడింప
శక్రదత్తామోఘశక్తి వే సంధించి, విడిచినఁ బవికోటివితతు లొదవ
శతసహస్రాయతసముదాయములఁ బేర్చి, దహనార్కసంహతిమహిమ దెగడి
సురలు సెలఁగంగ దానవవరులు గలఁగ, రాముశరములు దైత్యునురస్స్థలంబు
గాఁడి నెత్తుటఁ గడియక కనదుదార, సురుచిరోల్కలకైవడిఁ బరఁగి పఱచె.

2114


వ.

కొన్ని సీతామహాదేవికి రామువిజయంబు సెప్పుగతి లంకకుం జనియెఁ గొన్ని
యి౦ద్రాదులకు రావణవధంబు గాఁగలదని యెఱింగించుక్రియ నాకసంబున కరి
గెఁ గొన్ని దిక్కాంతలకు లోకంబులకు సేమంబు గల్గు నని నివేదించుకరణిఁ ద
దుపకంఠంబులకుఁ బోయెఁ గొన్ని యిటమీఁద సుఖంబున నుండఁగలవారని
యురగులకుఁ గుశలవార్త ప్రకటించుమాడ్కిఁ బాతాళంబున కేఁగెఁ గొన్ని
దశాస్యుసర్వావయవసంధిమర్మంబులు గాఁడె మఱియు నీరంధ్రంబు లై రఘు
వీరు శరంబులు నిగుడం దొడంగిన.

2115


మ.

అమరద్వేషి శరంబు లేసిన నసూర్యంపశ్యశైలోదర
స్థమహాగహ్వరగర్భనిర్భరమహాధ్వాంతప్రభావచ్ఛిదా
క్షమతేజంబునఁ గ్రాలి దిక్కులు వెలుంగంగా లలాటాంతరా
ర్యమసాహస్రసమంబు లై పొదివె నుద్యద్వేగసంపధ్గతిన్.

2116


వ.

ఇతరేతరజయకాంక్ష లినుమడింపం జలంబును బలంబును గదిరి యెదిరి స్రు
క్కక యుక్కు దక్కక యుభయబాణంబులుం బరస్పరభేదనంబు నొందుచుండ
నన్యోన్యతర్జనవాక్యంబులు రోదోంతరంబు నిండ నేకైకసక్రోధశోణలోచనమ
యూఖచ్చట లకాలసంధ్య గావింప సదృశసాహససంపాదనసమరవ్యాపారబల
శౌర్యశస్త్రచాతుర్యు లై యొక్కనిమిషార్ధంబు నుడుగక నిద్రాదివ్యవహారం