Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

కోపపావక[1]తీవ్రప్రతాపుఁ డగుచుఁ, జాపకౌశల మమరంగ నేపు రేఁగి
ధరణినాథువిపులభుజాంతరమునందు, వేయిశరములు నిగిడించె వివిధగతుల.

2073


క.

పరువడి రుధిరము దొరఁగఁగ, నరుదుగఁ దనరారి నినకులాధిపుఁ డంతన్
సురరిపునాశము సెప్పుచు, సరి నెత్తురు గురియుచున్నజలదముఁబోలెన్.

2074


చ.

పొరిఁబొరిఁ బంక్తికంధరుఁడు భూవరు నేసినఁ గాఁడి పాఱి యు
ద్ధురగతి నేల నాటి యతితూర్ణము లై భుజగాలి భీతిసం
చరమతిఁ జూచుచుండఁగ రసాతలిఁ జొచ్చె నజస్రపాపమే
దురత నుదగ్రబాణము లధోగతి నొందినమాడ్కి నారయన్.

2075


వ.

రాఘవుండును దశవదనకఠోరబాణపరంపరాసారజర్జరీకృతశరీరక్షతనిష్ఠ్యూతధా
రాళకరాళరక్తసిక్తుండై మండలీకృతకోదండనిర్యాతంబులును సంతమససంపా
దకంబులును సమాచ్ఛాదితచండకరప్రకాశంబులును నీరంధ్రీకృతదిక్తటంబులు
ను గనకపుంఖమండితంబులు నగునిశితప్రదరంబులు వఱపినం జేయునది లేక
నివ్వెఱఁగంది శరగ్రహణాకర్షణసంధానమోక్షణాదులందును బరాధీనుండై యు
న్నం గనుంగొని దరహసితచంద్రికాసముల్లసితవదనచంద్రుం డై రామచంద్రుం
డు పేర్కొని పిలిచి రావణున కి ట్లనియె.

2076


మ.

తగునే స్రుక్కఁగఁ బెక్కుపంతము లొగిన్ దర్పంబుతో నాడి యి
ట్లు గడున్ నివ్వెఱఁ గంది యుండఁగ భుజాటోపంబు దా నెందుఁ బో
యె గుణంబుల్ దలపోయ కాడుదువు నీ వీభంగిఁ బొ ల్పేదినన్
నగరే నీసరివార లిందులకు నోనక్తంచరాధీశ్వరా.

2077


మ.

మును మీయన్నఁ గుబేరు గెల్చి సుమహామోదంబునం బుష్పకం
బనుమానింపక పుచ్చుకొంటి వతిమాయాదక్షతం గానలో
నను నాతమ్మునిఁ గన్మొఱంగి యిది యన్యాయంబు నా కట్లు భూ
తనయం దెచ్చితి నీవు వింశతిభుజా తర్కింపఁగా శౌర్యమే.

2078


క.

నాకన్నులయెదురం బడి, నీ కెక్కడి కేఁగవచ్చు నిష్ఠురగతిఁ బో
నీక పొలియించువాఁడం, జేకూరెం గోర్కి నాకు జితబలభేదీ.

2079


తే.

పాఱి పోయినఁ బో నీక పట్టి కూల్తు, నాతతాయివి నమరారి వైననిన్ను
నంబుజాసనహరిహరు లడ్డ మైన, నిజము సు మ్మిది యోరజనీచరేశ.

2080


వ.

నీమాంసశోణితమేదోమస్తిష్కంబుల భూతతృప్తి గావింతు నని పలుకుచున్న
యవ్వసుధావల్లభు నవలోకించి లంకావల్లభుండు సాగ్రహంబుగా ని ట్లనియె.

2081


చ.

గొనకొని యుద్ధరంగమునఁ గొందఱ రాక్షసులన్ వధించి యే
పునఁ గడు విఱ్ఱవీఁగెదవు పోటరి నంచు ని దెంతపెద్ద యి
వ్వనచరసేనఁ గూడుకొని వచ్చి సముద్రము దాఁటి క్రొవ్వునన్

  1. తీవ్రతాటోపుఁ డగుచు