Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్లోలకరాళ మై జగములోఁ గొన వచ్చినమాడ్కి ఖడ్గజి
హ్వాలభుజాభుజంగవలనాకులముం బటహాదినిస్వనా
భీలము గాఁ గడుం గడఁగి పేర్చి నిశాచరసేన త్రోచినన్.

528


క.

సంజ వొడతెంచె నిఁకమీఁ, దం జీఁకటి లావు యాతుధానుల కనుచున్
శింజిని మ్రోయించుచు రఘు, కుంజరుఁడు వెసం గడంగి ఘోరాస్త్రములన్.

529


ఉ.

వాహనసూతయోధరరథవర్గము లొక్కటఁ గుప్పఁగూర నా
రోహకపాతముల్ బెరయ మ్రోయుచు దంతులు మ్రొగ్గ వాహసం
దోహము లాశ్వికాంగములతోడఁ బొరింబొరిఁ గూలఁ గైదువుల్
బాహులు మున్నుగాఁ దునిసి బల్విడిఁ గాల్వురు'ద్రెళ్ల నేయుచున్.

530


చ.

అడరి వధింప నప్పుడు దదాశుగవేగము సైఁప కందఱున్
వడి సెడి యొక్కదిక్కునకు వచ్చుచుఁ గూడి తగంగ వెండియు
న్మిడుతలు సిచ్చువాతఁ బడి నీ ఱగుకైవడి నప్డు మంటలం
దొడిఁబడి మ్రందఁగా సమరదోహలు లై కపులం దెరల్చుచున్.

531


వ.

శుకసారణవజ్రదంష్ట్రమహాకాయమహాపార్శ్వమహోదరులు గాలమేఘంబులుం
బోలె గర్జిల్లుచు శరాసారఘోరంబుగా నొక్కటం దనపయిం గవియ నవ్వీర
శేఖరుండు దదవసరసంధ్యారాగరక్తంబు లగునుత్సలంబులుంబోలెఁ గ్రోధారు
ణితలోచనంబు లలర నయ్యార్వుర నాఱుబాణంబుల నొప్పించి తొలఁగించి
మఱియు లీలావిక్రమంబులు సలుపం దోన వానరులుం గడంగి.

532


క.

ఆఁకరముతోడ నప్పెను, మూఁకలపై కుఱికి కఠినముష్టినిహతులన్
మ్రాఁకుల శిలలను బీనుఁగు, ప్రోకలు గావించి [1]రపుడు పొడవడక వడిన్.

533


క.

అంగదుఁ డొక్కమహాగిరి, శృంగముఁ గొని పెలుచ [2]నింద్రజితుపై నంతన్
నింగి సెలఁగ నార్చుచుఁ గది, యంగ నదృశ్యుఁడయి చనియె నాతఁడు నంతన్.

534


ఉ.

దిక్కులు మూయుచుం గలయఁ దెల్పులు మాపుచు మిన్ను గప్పుచుం
బెక్కు లొకండుగా ముసుఁగుఁ బెట్టుచుఁ జూడ్కుల కందకుండ నే
యిక్కలుఁ దోఁపకుండఁ దల మెక్కుచు ము న్నగుసైన్యధూళితోఁ
గ్రిక్కిఱియం దమం బడర రెండుదెఱంగులవారు నొండొరున్.

535


శా.

ఓరీ శాత్రవుఁ డెవ్వఁ డెవ్వఁ డనుచున్ హుంకారఘోరంబుగా
రారా యంచు మిమున్ హరించుహరి నేరా యంచు నేరా నిశా
చారిం గీశకులాశి నంచు వెసఁ గేశాకేశి వర్తింపఁ దెం
పారం బోయి రెలుంగునిక్కలకు నయ్యాశ్చర్యపుంజీఁకటిన్.

536


తే.

తొడినమణికంకణాదుల వెడలుదీప్తు
లోషధులు గాఁగఁ దెఱచునో ళ్లుగ్రగుహల

  1. నారిఁ బొడ వడఁగింపన్
  2. నింద్రజిత్తునిమీఁదన్; ఇంద్రజిత్తుఁడనియే వ్రాఁతప్రతులందు గనుపట్టెడిని.