పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జాతీయోద్యమంలో పురుషులతోపాటు మహిళలు కూడ అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించారు.బ్రిటిషు ప్రభుత్వదాష్టీకాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగిన మహిళలు ఉద్యమకారులలో ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండ, నిర్భయంగా ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆనాటి తొలితరం మహిళలలో శ్రీమతి ఆబాది బానో బేగం అగ్రగణ్యురాలు. ఆమె ఎంతో ఉత్సాహంతో ఉద్యమ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర వహించటం వలన ఆమె నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమకారులు ఎంతో ప్రేమతో బీబీ అమ్మ అని ఆమెను పిలుచుకున్నారు.

ఆబాది బానో బేగం ఉత్తర ప్రదశ్‌ రాష్రం మొరాదాబాద్‌ జిల్లా అమ్రోహా గ్రామంలో 1852లో జన్మించారు. ఆమెకు రాంపూర్‌ సంస్థానానికి చెందిన అబ్దుల్‌ అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. అత్తవారింట ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. ఉర్దూ, పర్షియన్‌ భాషల లిపి ఒక్కటే కావటం, ఆ లిపులు అరబ్బీ భాషకు దగ్గరగా ఉండటంతో చిన్ననాటనే ఖురాన్‌ గ్రంథాన్ని పఠించటం వలన లిపులను గుర్తించటం ఆమెకు సులువైంది. మంచి ధారణశక్తి గల ఆమె ఉర్దూ, ప పర్షియన్‌ భాష ల లిపు లను సు నాయాసంగా

91