జాతీయోద్యామకారులను ఉత్తరాలతో ఉత్తేజపరచిన
బేగం జాఫర్ అలీ ఖాన్
జాతీయోద్యమ చరిత్ర పుటలను కాస్త ఓపిగ్గా తెరిస్తే స్వాతంత్య్రోద్యమంలో భర్తలతో పాటుగా పలు త్యాగాలకు సిద్ధపడి, మాతృభూమి విముక్తికి పోరుబాటను ఎంచుకున్న తల్లులు ఎందారో మనల్ని పలకరిస్తారు . భర్త అడుగుజాడల్లో నడుసూ, జీవిత భాగస్వామికి సంపూర్ణ తోడ్పాటు అందచేయటం ఒకవంతైతే బ్రిటిష్ పాలకుల కుయుక్తుల వల్ల భర్తలు నిర్వహిస్తున్నకార్యక్రమాలకు అంతరాయం ఏర్పడిన సమయంలో, తామున్నామని రంగం మీదకు వచ్చి భర్త బాధ్యతల భారాన్ని స్వీకరించి సమర్ధవంతంగా మాత్రమేకాదు స్పూర్తిదాయకంగా నిర్వహించగలగటం గొప్ప విషయం. ఆ కోవకు చెందిన జాతి మహిళా రత్నాలలో ఒకరు బేగం జాఫర్ అలీఖాన్.
ప్రముఖ స్వాతంత్య్రసమరయాధులు మౌల్వీ జాఫర్ అలీఖాన్ సతీమణి బేగం జాఫర్ అలీఖాన్. భర్త జాఫర్ అలీఖాన్ పేరుతో ఆమె ప్రసిద్దిచెందారు. 1904లో జాఫర్ అలీఖాన్ తండ్రి మున్షీ సిరాజుద్దీన్ ప్రారంభించిన ఉర్దూ పత్రిక జమీందార్ సంపాదాకత్వాన్ని 1909లో చేపట్టిబ్ రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా దానిని బలమైన అస్త్రంగా తీర్చిదిద్దారు . బ్రిటిష్ వలసపాలకుల దాష్తీకాలను, దోపిడు విధానాలను విమర్శిస్తూ జమీందార్ పత్రిక ద్వారా ప్రజలలో బ్రిటిష్ వ్యతిరేకతను చాలా బలమైన ప్రచారంగావించారు. బ్రిటిష్ 79