భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు
మహిళ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యామంలో బహిరంగంగా పాల్గొనటం ఇదే ప్రథమమని
ఆనాడు పలువురు శ్లాఘించారు. జాతీయోద్యమకారుడైన భర్త ఆమెను పర్దాపద్దతి నుండి
విముక్తి చేయడంతో, రబియాబీ మరింత ఉత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలోని ప్రతి
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ధా వ్యతిరేక ప్రదార్శనలో స్వయంగా
పాల్గొనటమేకాక యుద్ధ వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యచకితులను చేశారు.
ఆనాడు మహిళలకు జైళ్ళల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేనందున అరెస్టు కాకుండ
తప్పించుకున్నారు. స్వజనుల చేత పలు విమర్శలకు గురైనప్పటికీ ఖాతరు చేయకుండ,
చివరి శ్వాస వరకు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ఆమె మానలేదు.
నైజాం విలీనోద్యమంలో...
స్వాతంత్య్రం సాధించాక, ఇండియన్ యూనియన్లో నైజాం విలీనమవ్వాలన్న డిమాండ్తో సాగిన పోరులో కూడ రాష్ట్రానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్న దాఖలాలున్నాయి. ముస్లిం మహిళలకు ఉన్న మత, సామాజిక బంధనాల మూలంగా పెద్ద సంఖ్యలో ఉద్యమ బాటన నడవలేకపోయినప్పటికీ, ఉద్యమకారులైన తమ బిడ్డలను, భర్తలను ఎంతగానో ప్రోత్సహించారు. పరోక్షంగా సహకరించారు. ఈ విధంగా పరోక∆ సహాయం అందచేసిన వారెందరో ఉన్నప్పటికీ అందరి వివరాలు తెలియరాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్య్ర సమరయోదుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆ అదృష్టవంతురాలు నఫస్ ఆయేషా బేగం. ఆమె హెదారాబాద్ నివాసి. ఆమె తండ్రి పేరు హామీద్ ఆలీఖాన్. ఆమె 16-9-1948 నుండి 17-9-1948 వరకు రెండురోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. నైజాం విలీనం కోరుతూ ఉద్యమించినందున ఆమె నిర్బంధానికి గురయ్యారు. ఆమె పేరు తప్ప మరే ముస్లిం మహిళ పేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కన్పించపోవటం ఆశ్చర్యం కల్గించే అంశం.
తెలంగాణ పోరాటంలో....
ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడ ముస్లింలు తమ భాగస్వామ్యాన్ని అందించారు. స్త్రీ, పురుష భేదం లేకుండ ఆ పోరులో పాల్గొన్నారు. అటువంటి వారిలో రాజారాం గ్రామానికి చెందిన జైనాబి ఒకరు. పేదరైతు కుటుంబానికి చెందిన ఆమె పోరాట నాయకులకు తన ఇంట రక్షణ కల్పించారు. పోలీసుల నుండి
31