పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


కుమారుడు ఫరూఖ్‌ అబ్దుల్లా మంత్రివర్గంతో ఆక్బర్‌ జహాన్‌ బేగం Muslim Women of India, Gouri Srivastava, Concept Publishing Company, New Delhi, 2003, Page.108 -109).

1947 న్‌లో లార్డు మౌంటుబాటన్‌ తన ప్రణాళికను వెల్లడించాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా భారతదేశం రెండుగా చీలిపోవటం ఖాయమయ్యింది. ఆ సమయంలో పండిత నెహ్రూ సలహా మీదా డాక్టర్‌ అబ్దుల్లాను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయన విడుదల కాగానే కశ్మీరు సంస్థానం భవిష్యత్తును ప్రజలు నిర్ణయించాలి తప్ప సంస్థానాధీశులు నిర్ణయించటం సముచితం కాదని ప్రకటించారు. ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్‌ నాయకులు ఆయనతో ఏకీభవించారు.

ఇండియా విభజన సందర్భంగా పాకిస్తాన్‌ నాయకుల ప్రేరణతో కశ్మీరును ఇండియా నుండి దూరం చేయాలని ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. కశ్మీరులోని గిరిజన జాతులను రెచ్చగొట్టి జమ్మూ-కశ్మీరులోని కొన్ని ప్రాంతాల ఆక్రమణకు ప్రయత్నాలు సాగాయి. ఆ ప్రమాదకర పరిస్థితులలో డాక్టర్‌ అబ్దుల్లా, బేగం అక్బర్‌ జెహాన్‌ తమ నిర్ణయాల మీద స్థిరంగా నిలబడ్డారు. పాక్‌ ప్రేరిత ఆక్రమణదారులను తిప్పికొట్టేందుకు ప్రజలను కూడగట్టారు . ప్రజలను భయ భ్రాంతుల్ని చేయడానికి వ్యాపింపచేస్తున్న పుకార్లను ఖండిస్తూ అబ్లుల్లాతో పాటుగా అమె కూడ వీధుల్లోకి వచ్చి ప్రజలకు నచ్చచెప్పి భీతాహులు కాకుండ పరిస్థితులను అదుపులోకి తీసుకరావటంలో అమె తొడ్పడ్డారు

ఆ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్లా మ్లాడుతూ ఈనాడు పాకిస్తాన్‌ నుండి

275