పరాయి పాలకులను ప్రాలదోలేందుకు కుటుంబాలకు కుటుంబాలు పాటుపడిన
వైనం స్వాతంత్య్రోద్యమం పట్ల భారతీయులలో నిబిఢీకృతమైఉన్న నిష్టకు-నిబద్ధతకు
రుజువు. ఆ కుటుంబాలలో నెహ్రూ˙ కుటుంబం, తయ్యాబ్జీ కుటుంబం, పైజీ కుటుంబం,
కిచ్లూ కుటుంబం, కిద్వాయ్ కుటుంబం లాంటి కొన్నికుటుంబాలను ప్రధానంగా
పేర్కొనవచ్చు. ఆ కుటుంబాలు అద్వితీయ త్యాగాలతో స్వాతంత్య్రోద్యమం చరిత్రలో
తమదంటూ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అటువంటి చరిత్ర కలిగిన కిద్వాయ్
కుటుంబ సభ్యురాలు అనిస్ బేగం కిద్వాయ్.
ఉత్తర ప్రదేశ్లోని బారాబంకిలోని షేక్ విలాయత్ అలీ ఇంట అనిస్ బేగం 1906లో జన్మించారు. తండ్రి విలాయత్ అలీ న్యాయవాది. ఆయన బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేకి. ఆంగ్లేయులకు అండగా నిలచిన అలీఘర్ మేధావులతో సరిపడని వ్యకి. హిందూ ముస్లింల ఐక్యతను ఆకాంక్షించే సమరయాధులు. భారత జాతీయ కాంగ్రెస్-ముసింలీగ్ ల మధ్య సయాధ్యను కోరుకున్న ప్రముఖులు. (Rafi Ahamed Kidwai, Dr.M.Hashim Kidwai, Govt. of India Publications, NewDelhi,1986, Page. 24-25) చిన్నతనం నుండి బేగం అనిస్ తండ్రితోపాటుగా రాజకీయ, సాహిత్య సభలు,
261