పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


విధాంగా పేర్కొన్నారు.

1952లో మఖ్దూం విడుదలయిన తర్వాత నన్ను స్త్రీలతో పనిచేయమన్నాడు. మేమెట్లా చేయగలుగుతాం ? తాయి (ప్రమీలా తాయి) ఇంకా విడుదల కాలేదు. ఆహార ధాన్యాల ధారల సమస్య బాగా పనికొచ్చింది. ముస్లింలలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువైపోయింది. ఈ సంఘాలు వారిని ఆకర్షించలేదు. ఇంకా కొంత ఆకర్షనీయమైనవి కావాల్సి వచ్చింది. ఓంకార్‌ స్త్రీల ప్రజాస్వామ్య సంఘం పెట్టడానికి తోడ్పడ్డాడు. దాని నియమావళి తయారు చేశాడు. నలభై మంది స్త్రీలు కుట్టుపని, చేతిపని నేర్చుకునేవారు. మేము రాయటం, చదవటం నేర్పించేవాళ్ళం. పత్రికలు పుస్తకాలు కొనేవాళ్ళం. చదవటం, చర్చలు పెట్టడం చేసేవాళ్ళం. డబ్బు సరిపోయేది కాదు. కోఆపరిేటివ్‌ ఇనస్పెక్టరు కోఆపరిేటివ్‌ పెట్టమని సలహా యిచ్చాడు. చాలా మంది కాలేజీ టీచర్లు షేర్‌ హోల్డర్స్‌గా చేరారు. ఆడవాళ్ళకు జీవనాధారం చూపించటం, ఏదైనా పనిగానీ ఒక స్కిల్‌గాని నేర్పించటం ఆ కోపరిేటివ్‌ ఆశయం. చాలా మంది పరిక్షలిచ్చి పాసయ్యారు కూడ. ఇప్పుడు కూడ ఆ పని జరుగుతుంది కాని, తక్కువ శక్తితో, ఇద్దారు టీచర్లున్నారు. తెలుగు, ఉర్దూ ఎనిమిదవ తరగతి దాకా నేర్పుతారు. టెక్నికల్‌ ఏడ్యుకేషన్‌ బోర్డు కూడ దీన్ని గుర్తించింది. మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ బ్రాంచ్‌లు కూడ ఉన్నాయి.

గతంలో పర్దాలాంటి సమస్యల గురించి చర్చించేవాళ్ళం. చాలా మంది రజియా సజ్దార్‌ జహీర్‌, ఇస్మత్‌ చోగ్తాయి లాంటి వాళ్ళు వచ్చి మ్లాడేది. ఆరోజుల్లో స్త్రీలు చదువుకున్న వాళ్ళు రాకపోయినప్పుికి ప్రశ్నలడిగి ఎన్నో నేర్చుకునేవారు. ఇప్పుడెవరికీ ఆ కుతూహలం లేదు. పార్టీ గురించిగాని, రాజకీయ సమస్యల గురించి కానీ తెలియదు. బహుశ గల్ప్‌దేశాల నుంచి వచ్చే డబ్బు కారణం కావచ్చు. కొంత వరకు పార్టీకి ఆసక్తి లేదు. ఏమి పట్టించు కోదు. మహిళా ప్రజాస్వామిక సంఘం ఏమైనా కాన్పెరెన్స్‌ కెళ్ళాల్సి వచ్చినప్పుడే పనికొస్తుంది.

ఆ విధంగా స్థానికంగా మహిళలలో పనిచేస్తూ జాతీయస్థాయి కార్యక్రమాలలో కూడ ఆమె చురుకుగా పాల్గొన్నారు. స్వయంగా ఇతర ప్రాంతాలలో జరుగుతున్న సభలు, సమావేశాలకు హజరయ్యారు. ఆనాడు జమాలున్నీసా, ఆమె సహచరులు ఎదుర్కొన్న ఇబ్బందులు అమె మాటల్లో ఇలా ఉన్నాయి.

1952-53లో ఢిల్లీ కాన్పెరెన్స్‌లో మేము అఖిలభారత మహిళా కాన్పెరెన్స్‌ (జు|ఇ్పు) నుంచి వేరుపడ్డం. 54లో కలకత్తా సమావేశంలో మహిళా ప్రజాస్వామిక

245