పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లి తండ్రులను మించిన త్యాగగుణశీలి

బేగం జొహరా అన్సారి

( -1988)

భారత స్వాతంత్య్రోద్యమంలో వ్యక్తులు పాల్గొనటమే కాకుండ కుటుంబాలకు కుటుంబాలు పాల్గొని బ్రిటీష్‌ ప్రభుత్వ దాష్టీకాలను ఓర్పుతో భరించిన త్యాగశీలురైన కుటుంబ సభ్యులు జాతీయోద్యమ చరిత్రపు టలలో దర్ నమిస్తారు . ఆ విశిష్ట కుటుంబాలలో డక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి కుటుంబం ఒకటి. ఆ కుటుంబానికి చెందిన మహిళారత్నం బేగం జొహరా అన్సారి.

భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యాక్షపదవిని అత్యంత సమర్థ్ధవంతంగా నిర్వహించిన స్వాతంత్య్రోద్యమ నాయకులలో అగ్రగణ్యుడిగా ఖ్యాతిగాంచారు డాక్తర్ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి. అనితర సాధ్యమైన దాయాగుణంతో స్వయంగా మహాత్ముని వందనాలందుకున్న శ్రీమతి షంషున్నీసా అన్సారి, డాక్టర్ అన్సారిల పెంపుడు కూతురు బేగం జొహరా అన్సారి.

ఆనాడు జాతీయోద్యమానికి ఢిల్లీలోని డాక్టర్‌ అన్సారి గృహం ప్రధాన కేంద్రంగా ఉండేది. జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ కార్యక్రమం ఢిల్లీలో జరిగినా, ఆ సమావేశాలకు హాజరయ్యేవారికి అన్సారి ఇంట ఆతిధ్యం తప్పనిసరి. చిన్నారి జొహరా ఆ సమావేశాల ప్రాంగణంలో కలయతిరుగుతూ నాయకుల ఉపన్యాసాలు, చర్చలు వింటూ

221