మతం పేర దేశ విభజన తగదంటూ ' లీగ్ ' ను ఎదుర్కొన్న
బేగం మజీదా బానో
(1919- 1974)
బ్రిటిష్ వలసపాలకులను తరిమివేతకు పోరాటం సాగిస్తున్న ప్రజలను, ద్విజాతి సిద్ధ్దాంతం ఆసరాతో చీల్చి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న స్వార్థపర శక్తులకు, వ్యక్తులకు వ్యతిరేకంగా కూడ ప్రజలు ఉద్యమించారు. భారతదేశంలోని ముస్లింలకు ప్రతినిధిగా ప్రకంచుకున్న ముస్లిం లీగ్ వేర్పాటువాదచర్యలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, మతం పేరుతో అధికారాన్ని చేప్టాలనుకుంటున్న శక్తుల ఎత్తులను చిత్తుచేయడనికి సాహసంతో బరిలోకి దిగిన సాహసి శ్రీమతి మజీదా బానో.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదారాబాదులో బేగం మజీదా బానో 1919లో జన్మించారు. ఆమె తండ్రి ముస్తా ఫా అహమ్మద్. ఆయన నిజాం సంస్థ్ధానంలో ఉద్యోగి. పదవ తరగతి చదాువుతున్నప్పుడు ఆమె వివాహం ఉత్తర ప్రదేశ్కు చెందిన న్యాయవాది మహమ్మద్ సిద్ధీఖీ తో జరిగింది. వివాహం తరువాత భర్తతో పాటుగా ఆమె ఉత్తర ప్రదేశ్ వెళ్ళిపోయారు. భర్త కుటుంబంతో సన్నిత సంబంధాలు గల ప్రముఖ జాతీయోద్యామ నాయకులు రపీ అహమ్మద్ కిద్వాయ్ ప్రబావంతో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు.
175