పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాణం కంటే ఆత్మగౌరవం ప్రధానమని భావించిన

సాదత్‌ బానో కిచ్లూ

(1893-1970)

మాతృదేశం పట్ల భక్తి భావన గల దేశభక్తులకు అక్షరజ్ఞానం తోడై, ఆ అక్షర యోధులకు దాస్య శృంఖలాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న దృడ సంకల్పంతో పోరుబాటను ఎంచుకున్న ఉద్యామకారులు జీవిత సహచరులైనట్టయితే, అటువిం మహిళలు అద్భుతాలను సృషించగలరు. ఆ మహత్తర అవకాశం దక్కించుకున్న ఉద్యమకారిణి బేగం సాదాత్‌ బానో.

పంజాబు రాష్ట్రం అమృతసర్‌లోని సంపన్న కుటుంబంలో 1893 జనవరి 10న సాదాత్‌ బానో జన్మించారు. ఆమె తండ్రి మియా హఫజుల్లా. ఆమె పుినిల్లు విద్యావికాసాల కేంద్రం. తండ్రి, అన్నయ్య సయీదుల్లా సాహెబ్‌లు ఆమె విద్యాభ్యాసం పట్ల ప్రత్యేక శ్రద్ధా తీసుకున్నారు. ఆ కారణంగా ఆమె పలు భాషలను నేర్చుకున్నారు. ఆమెకు ఉర్దూ, పర్షియన్‌ భాషలలో మంచి ప్రవేశం లభించింది. మంచి విద్వత్తు లభించిన కారణంగా ఆమె 1910 నుండి కవిత్వం రాయడం ఆరంభించారు. ముసిం మహిళలు చదుా వుకోవటమే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో సాదాత్‌ బానో జాతీయోద్యామ స్పూర్తితో కవితలు రాస్తూ, ప్రముఖ కవుల, పండితుల ప్రశంసలందాుకున్నారు. 167