పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృదేశ సేవకు ఖరీదు కట్టనిరాకరించిన

జుబైదా బేగం దావూది

(1885-)

బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో సర్వసం త్యాగం చేసి, జీవిత చరమాంకంలో కటిక దారిద్య్రంలో మగ్గుతు న్నప్పటికి ఏమాత్రం చలించకుండ, ఎవరి అండను ఆశించకుండ,చివరివరకు ఆత్మగౌరవమే పెన్నిధిగా నిలచిన స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రసమరచరిత్రలో తక్కువ మంది తారసపడతారు. అటువంటి వారిలో చిరస్మరణయు రాలు జుదైదాబగం.

1885 అక్టోబర్‌లో బీహార్‌ రాష్ట్రం, ముజఫర్‌పూర్‌ జిల్లా పారో గ్రామంలోని అత్యంత సంపన్న కుటుంబంలో జుదైదా బేగం జన్మించారు.తండ్రి అబ్దుల్‌ ఫతహా సాహెబ్‌ భూస్వామి. ఆయన బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతా ధికారి. ప్రముఖ న్యాయవాది మౌలానాషఫీ దావూదిని ఆమె వివాహమాడారు. ఆయన మహాత్మా గాంధీ, డక్ట ర్‌ రాజేంద్రాప్రసాద్‌, పండిత మోతిలాల్‌ నెహ్రూ లాంటి ప్రముఖుల సహచరులు. మౌలానా దావూది స్వాతంత్య్ర సమరంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న ప్రముఖ నాయకులు. ఆయన రాజకీయాభిప్రాయాలను, జాతీయో ద్యమంలో ఆయన అనుసరిస్తున్న విధివిధానాలను జుబైదా బేగం యధావిధిగా స్వీకరించారు. మౌలానా అలీ సోదరుల తల్లి, జాతీయ ద్యమంలో బీబీ అమ్మగా ఖ్యాతిగాంచిన ఆబాది బానొ బేగం ఉద్యమ కార్యక్రమాలలో 151