పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధం వద్దని నినదించిన తెలుగింటి ఆడపడుచు

రబియాబీ

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న సామాన్య స్త్రీలు పలు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. ఈ వెతలు మూడు రకాలుగా ఆనాడు మహిళలను చుట్టుముట్టాయి.తొలుత కుటుంబం, ఆ తరు వాత సమాజం, చివరకు బ్రిటిష్‌ పోలీసు మూకల నుండి ఇబ్బందుల వాతావరణం. ఈ వెతలు ముస్లిం మహిళ విషయానికి వచ్చేసరికి మరింత కఠినమై వారిని ముందుకు సాగనిచ్చేవి కావు. బ్రిటిష్‌ పోలీసుల దారుణ దాష్టీకాల కంటే, కుటుంబం, సమాజం కల్పించే ఆటంకాల ప్రభావం వారి మీద తీవ్రంగా ఉండి, మాతృదేశ సేవామార్గంలో కొంతవరకు అవరోధాలయ్యాయి. అయినప్పటికీ శ్రీమతి రబియాబీ లాంటి సాహసులు ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి జాతీయోద్యమంలో పాల్గొని చరిత్ర సృష్టించారు.

రబియాబీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా చియ్యడు గ్రామానికి చెందిన మహిళ. ఆమె భర్త యం.మొహిద్దీన్‌ సాహెబ్‌. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు. ఆమె భర్తతోపాటుగా జాతీయ భావాలను అలవర్చుకున్నారు. ఆనాడు మహాత్ముని నేతృ త్వంలో సాగుతున్న జాతీయోద్యమంలో భాగం పంచుకోవాలనుకున్నారు. కుటుంబం, సమాజం సహజంగానే ఆమె ఆలోచనలను ముందుకు సాగనివ్వలేదు. ఆమె నిరాశ చెందాలేదు. భర్త కూడ స్వాతంత్య్ర సమరవీరుడు కావటం వలన ఆయనతో తన

1327