పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

గారు ఖురాన్‌ తర్జుమా గావిస్తున్నారు. రాత్రి 2 గంటల తరువాత లేచి కూర్చోని ఆయన ఎంత సేపు ఆ పనిలో ఉంటారో అంతసేపు నేనూ మేల్కొని ఆయనకు వింజామర వీస్తూ గడుపుతున్నాను. బాగా ఉక్కపోతగా ఉంది కదా. ఆయన మేల్కొని పనిచేస్తుంటే నేనెలా నిద్రపోగలను చెప్పు? (Bharath Ke Swatantra Samg ram me Muslim Mahilavonka Yogdan (Hindi), Dr. Abida Samiuddin, IOS, New Delhi, 1997 Page.168) అని ఆమె ప్రశ్నించారు. ఈ సమాధానం దాfiరా ఆమెలోని సేవాగుణం, భర్తకు అందచేసిన సేవల తీరుతెన్నులు వెల్లడవుతున్నాయి.

1923 ప్రాంతంలో తన 35 సంవత్సరాల వయస్సులో మౌలానా భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షు లుగా ఎంపిక కావటంతో ఆయ న కార్య క లాపాలు బాగా విస్తృతమయ్యాయి. అప్పటి నుండి ఆయన రాజకీయాలలో మరింత బిజీ అయ్యారు. భారతదేశం అంతా పర్యటిస్తూ, కార్యక్రమాలలో పాల్గొంటూ, అరెస్టులు, జైళ్ళల్లో గడుపుతూ మౌలానా ఇంటిపట్టున ఉండటమే కరువైంది.1939లో మరోసారి ఆయన జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షస్థానం అలకరించారు. స్వాతంత్య్రోద్యమం అతి కీలక దశలో ఉన్నందున జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు మరింతగా పెరిగాయి. ఆ సమయంలో ఆయనకు భార్య గురించిగాని, ఆమె ఆరోగ్యం గురించిగాని, ఆర్థిక పరిస్థితుల గురించి గాని పట్టించుకునే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. ఆ బాధాకరమైన వాతావరణాన్ని ఏకాంతంగా భరిస్తూ, అన్ని అవస్థలను సహిస్తూ జులేఖా బేగం గడిపారు.

ఆ క్రమంలో భర్తకు అన్ని విధాల తోడ్పాటు అందించటం మాత్రమేకాకుండ అవసర సమయాల్లో ఇంటి నుండి బయటకు వచ్చి భర్త స్థానాన్ని భర్తీ చేయడానికి సాహసించిన జులేఖా బేగం అంతితో ఆగలేదు. స్వాతంత్య్రసమరంలో పాల్గొంటున్న ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటూ పట్టుదల సడలిపోకుండ ఆ త్యాగమూర్తులు సమరభూమిలో సాగిపోవడానికి ఎంతగానో తోడ్పడ్డారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో ఆమె తన అనారోగ్యాన్ని లెక్కచేయలేదు. ఆ కారణంగా నా భావాలను విశ్వాసాలను పంచుకోనడమే కాక నా జీవితంలో నిజమెన సహచరిణిగా నిలచింది అని ఆమె గురించి ఆజాద్‌ స్వయంగా పేర్కొన్నారు. (అబుల్‌ కలామ్‌ ó పేజి. 111)

1941లో జులేఖా బేగం అనారోగ్యం తీవ్రతరమయ్యింది. స్థల, జల మార్పిడి

132