పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తా పారిశుధ్య కార్మికుల పెద్దమ్మగా ఖ్యాతిగడించిన

మజీదా హసీనా బేగం

భారతదేశంలోని విప్లవదళాలు బ్రిటిష్‌ ప్రభుత్వ పైశాచిక దాడులకు గురై, విప్లవకారులు భయంకర శిక్షలకు బలి కావటంతో స్వాతంత్య్రోద్యమంలో అగ్నియుగం గా భాసించిన విప్లవోద్యమం కొంత మేరకు బలహీనపడింది. మాతృభూమి విముక్తి కోసం ఆ యోధులు ప్రదర్శించిన అసమాన దేశబక్తి ప్రజలలో, ప్రదానంగా యువకులలో, త్యాగపూరిత ఆలోచనలకు అంకురార్పణ చేసింది. ఆ సమయంలో రష్యాలో ప్రజలు సాధించిన విజయం ప్రపంచ వ్యాపితంగా యువతరాన్ని ఉత్సాహపర్చింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఒకవైపున పోరాడటమే కాకుండ అన్నిరకాల దోపిడుకి వ్యతిరేకంగా ఉద్యామించాలన్న చైతన్యానికి ఆ ఉత్సాహం కారణమయ్యింది. ఈ మేరకు వెలువడిన చైతన్యదీప్తుల వెలుగులో అంకిత భావం గల యువత పుట్టుకొచ్చింది. ఆ వెలుగు దివ్వెలలో ఒకరు శ్రీమతి మజీదా హసీనా బేగం.

ప్రసుత పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాను ప్రదాన కేంద్రంగా చేసుకుని బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించి మజీదా హసీనా బేగం ప్రజా పోరాటాలకు నాంది పలికారు. జాతీయోద్యామంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను కోరుతూ జనచైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజలలో బ్రిటిష్‌ వ్యతిరేక భావాలను పెంపొందించారు. ఈ జనచెతన్య కార్యక్రమాలలో భాగంగా ఆమె సాగించిన పర్యటనల్లో కలకత్తా పట్టణాన్ని


123