సయ్యద్ నశీర్ అహమ్మద్
ప్రజలు ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే బలమైన బ్రిటిషు ప్రభుత్వాన్ని మన దేశం నుండి తొలిగించగలమని మౌలానా దంపతులు ప్రబోధించారు. సfiస్వదేశీయతను ప్రోత్సహించటం తోపాటు విదేశీ వస్తువులను బహిష్కరణ తదితర అంశాల మీద ఆమె పటిష్టమైన ప్రచార కార్యక్రమానిflన్ని ఆరంభించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యామానికి ఊపిరిపోస్తూ అలీఘర్ ఖిలాఫత్ స్టోర్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు మౌలానా దంపతులు భారత దేశంలో ముందుగా స్వదేశీ బట్టల వ్యాపారం ఆరంభించిన వారయ్యారు. స్వదేశీని విస్త్రుతంగా ప్రచారం చేసేందుకు నిశాతున్నీసా పలు సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలలో ప్రసంగిస్తూ మహిళలను ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ ఉద్యమంలో ఆమె నిర్వహించిన బృహత్తర పాత్రను కొనియాడుతూ 1920 మే 19నాి యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ ప్రత్యే క శీర్షిక కూడ నిర్వహించారు.
1920లో మౌలానా హసరత్ మోహాని తమ నివాసాన్ని అలీఘర్ నుండి కాన్పూరుకు మార్చి అక్కడ ఖిలాఫత్ సfiస్వదేశీ స్టోర్స్ లిమిటెడ్ ను ప్రారంభించారు. ఈ వ్యాపార నిరfiర్వహణలో నిశాతున్నీసా బేగం భర్తకు చేయూతనిచ్చారు. ఆరంభంలో ఈ వ్యాపారం బాగున్నా ఆ తరువాత మౌలానా అరెస్టులు, ప్రభుత్వం ఒత్తిడి, పోలీసుల అరాచకం వలన వ్యాపారం నష్టదాయకంగా పరిణమించింది. ఆ కారణంగా ఆర్థికంగా మౌలానా ఇక్కట్లు పడాల్సివచ్చింది.
ఆర్థికంగా అవస్థల పాలవుతున్నా నిశాతున్నీసా దంపతులు రైలులో మూడవ తరగతి బోగీలలోని అసౌకర్యాలను భరిస్తూ సుదీర్గ… ప్రయాణం చేసి 1921 నాటి అహమ్మదాబాద్ సమావేశాలలో పాల్గొనేందుకు వచ్చారు. అహమ్మదాబాద్లో ఆబాది బానో బేగం నేతృ త్వంలో అఖిల భారత మహిళల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కస్తూరిబా గాంధీ, సరళా దేవిలతోపాటుగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిశాతున్నీసా మాట్లాడుతూ స్త్రీ విద్య పట్ల అత్యధిక శ్రద్ధ చూపాలన్నారు. మహిళలో చైతన్యం రావాలంటే ముందుగా చదువు చాలా అవసరమని భావించారు. స్వగ్రామంలో ఆడపిల్లలకు అక్షరజ్ఞానం అందించడానికి చిన్నతనంలోనే ప్రయత్నించిన నిశాతున్నీసా ఈసారి అఖిల భారత మహిళా కాంగ్రెస్ వేదిక మీద నుండి ఆ అంశాన్ని ప్రకటించారు.
1921లో అహమ్మదాబాద్ జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ
118