పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

528

భగవద్భక్తివిశేషమునఁ గవి మైమఱచి కేవల ధ్యానరూపముగ నీశతకమును గవి రచించెను. ధార నిర్దుష్టముగా మనోహరముగా నున్నదిగాని కవితలో భావసంపద మిక్కిలి కొఱవడియున్నది. ఈ వేంకటరత్నమాచార్య కవి మాకు జ్యేష్టభ్రాత. పసితనమునుండి తెలుఁగుభాషలో మాకభినివేశము గల్గించి మాపురోవృద్దికి దీవించిన యీస్వర్గస్థకవియెడఁ గృతజ్ఞతాసూచకముగ నీశతకమును బ్రచురించితిమి. ఈకవి నాలుగు సంవత్సరముల క్రిందట పరలోకగతుఁడయ్యెను. తమశతకసంపుటములో నీశతకమును బ్రచురించి కవిప్రతిష్ఠ చిరస్థాయి గావించిన ప్రకాశకు లగుశ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారియెడఁ గృతజ్ఞులము.

ఇట్లు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు