పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పీఠిక

ఈశతకము వ్రాసినకవి దూపాటి వేంకటరత్నమాచార్యులు. వెంకటరంగాచార్యులకుమారుఁడు. లోహితసగోత్రుడు. ఆంధ్రవైష్ణవబ్రాహ్మణుఁడు. ఈ కవి చిన్నతనముననే సంస్కృతాంధ్రము లభ్యసించి ప్రబంధపఠనముతోఁ గాలము గడిపి యుత్తరవయస్సునఁ బద్యరచనమున కారంభించెను. పూర్వవయస్సున విశ్లేషించి గేయములుమాత్రము రచించెను. కవితయందెగాక చిత్రలేఖనమునందునను, గానమందునను నీకవి కుశలుఁడు. “నాదెండ్లవాస" అను పద్యమువలన నీకవి ఈశతకమును నాదెండ్లలో నున్నపుడు రచింప నారంభించెను. అమరావతిలో నున్నపుడు 1-1-20 తేది శతకము పూర్తిచేసితి నని కవి స్వయముగా వ్రాసికొనెను.

శతకకర్త యీకృష్ణశతకమును దనమాతాపితల కంకిత మొసంగి ధన్యుఁడయ్యెను. ఈయన శౌరీ, రామా యను కందశతకములు రామచంద్ర యను సీసపద్యమకుటశతకము రచించెను. అవి పరిశోధించి శుద్ధప్రతి వ్రాయవలసియున్నది.