పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక


వేదాంతప్రతిపాదితమగు నీభద్రాద్రిరామశతకమును పరశురామనృసింహదాసు రచించెను. ఇతఁడు వైదికబ్రాహ్మణుఁడు. కోటేశ్వరసుబ్బమాంబలకుమారుఁడు. కవికాలము స్థలము నెఱుంగ శతకమునం దాధారములు లేవు. కవి కంభలూరి యప్పగురుని శిష్యుఁడు. ఈయననుగూర్చిన వివరములు తెలియవు గాన నించుమించుగ కవిజీవితము తెలియదనియే చెప్పవచ్చును.

శతకకవులచరిత్రమునం దీకవి భద్రాద్రిరామశతకమునందు 101 పద్యములు వ్రాసెనని వ్రాయఁబడెను. పూర్వముద్రణమునందు 101 పద్యములు మాత్రముంటం జూచి శతకకవులచరిత్రకారు లటుల వ్రాసియుందురు గాని ప్రత్యంతరములను బరిశీలింప 108 పద్యములు లభించినవి. ప్రథమమున నీశతకము తప్పులతడకగా అఱువదిసంవత్సరముల క్రిందట ముద్రితమయ్యెను. అందలి పాఠములు చాలవఱకు దుష్టముగా నుంటవలనఁ బ్రత్యంతరములతోఁ బోల్చి శుద్ధపాఠములు లుప్తపద్యములు చేర్చి శుద్ధప్రతి మిగులశ్రమమీఁద సిద్ధపఱచితిమి. కవి కేవల వేదాంతవిషయమునకుఁ బ్రముఖత నొసంగెను. భాష వ్యాకరణనియమములు నంతగాఁ బాటింపలేదు.

సీతారామాంజనేయమునందుఁ బ్రతిపాదితమైన