పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

143


వివిధ రాష్ట్రీయ ప్రభుత్వము మంత్రుల వశమైన శాఖల ఖర్చు లిట్లుండెను.[1]

రాష్ట్రము 1921-22 లక్షల రూ. 1923-24 లక్షల రూ. 1929-30 లక్షల రూ.
మదరాసు 428 418 763.8
బొంబాయి 561 478 567.6
వంగరాష్ట్రము 352 321 404.0
సంయుక్తరాష్ట్రము 352 314 388.2
పంజాబు 307 282 542.7

సైనిక వ్యయము సివిలు పరిపాలన సీమఖర్చులు పెరుగుచునేయున్నవి. విద్యకు వైద్యమునకు సొమ్ములేదు. గ్రుడ్డిలో మెల్లయనునట్లు ప్రాథమిక విద్యకొరకు చేయబడు ప్రభుత్వ వ్యయ విధానములో కొంతమార్పు కలిగినది. ఈ దేశములో నింతవరకు ప్రాథమిక విద్యకొరకు చేయబడిన మొత్తము వ్యయ మిట్లుండెను.[2]

1897 లో 1.10 కోట్లరూపాయిలు
1902 లో 1.18 కోట్లరూపాయిలు
1907 లో 1.55 కోట్లరూపాయిలు
1912 లో 2.07 కోట్లరూపాయిలు
1917 లో 2.93 కోట్లరూపాయిలు
1922 లో 5.09 కోట్లరూపాయిలు
1927 లో 6.95 కోట్లరూపాయిలు
  1. అంకెలు సైమను కమిటీ నివేదికలోనివి.
  2. అంకెలు సైమను కమిటీ నివేదికలోనివి.