పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

17

గవర్నమెంటువారు 17 1/2 లక్షలరూపాయిలు క్రొత్త స్కీములకు శాంక్షనుచేసిరి. సాధారణపరిపాలన క్రింద 12 లక్షలరూపాయిల వ్యయము తగ్గింపదలచిరి.

జాతీయాభివృద్ధిని కలుగచేయు శాఖలకు గతసంవత్సరముకంటె ఈ సంవత్సరము 23 లక్షలు ఎక్కువఖర్చు పెట్టదలచిరి. ప్రజాక్షేమమును పెంపొందించు పనులకు 26 1/2 లక్షలు ఏర్పాటు చేయబడెను.

ఈ క్రింది విధముగా ధనవ్యయము తల పెట్టబడినది: –

గ్రామముల అభివృద్ధికి రూ 10,00,000
గ్రామములలో గ్రంథాలయములకు 20,000
పెద్దపట్టణములలో కలితిలేని పాలు సప్లయికి 20,000
కలితీలేని నేతిని తయారుచేసి అమ్ముటకు 12,500
పల్లెలలో నాణ్యమైన విత్తులుసప్లయి చేయుటకు 3,00,000
ఫెర్‌టిలైజర్లను సప్లయి చేయుటకు 2,00,000
పశుజాతిని అభివృద్ధి పరచుటకు 37,500
ఫలములను ఎక్కువగా నుత్పత్తి చేయుటకు 2,000
బంగాళాదుంపలను పరిశోధించుటకు 5,000
వ్యవసాయమునకు గొట్టపునూతులకు 31,000
ఖాదీపరిశోధన సల్పుటకు 10,000
చేనేత పరిశ్రమల అభివృద్ధికొరకు 1,24,000
లేబరు వెల్ ఫేరుపనికి (కార్మికక్షేమమునకు) 10,000
బెల్లమును తయారుచేయు విధముల అభివృద్ధికి 38,000