పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల గవర్నరుజనరలుల దొరతనము

213


కాని డైరెక్టరుల కోర్టువారు వడవడ వడకిపోయిరి. ఆరునెలలు మాటలుజరిపి తుద కా గాజులు తొడుగుకొనినవారి నేల భయపెట్టవలెనని యూరకుంటిని. "

18 వ ఆగష్టు 1853:

“అయోధ్యరాజు కొంచెము పెంకితనము చూపునట్లున్నాడు. చూపవలెననియే నా కోరిక. నేను పోవులోపల వానిని కబళించుట నాకు తృప్తిని కలిగించును. ముసలి ఢిల్లీ రాజు చచ్చుచున్నాడు. డైరెక్టర్ల కోర్టువారు భయపడనియెడల వానితో తైమూరువంశము నంతమొందించి యుందును. ”

22 వ అక్టోబరు 1854:

"రాణులతోను, రాజులతోను విందులారగించిన పిదప, ధులీప్‌సింగు, గవర్నరుజనరలు గదిముందు పాదరక్షలు విడిచి లోనికివచ్చుట కిచ్చగించునని నేనుతలంపను. అయినను అతడు పాదరక్షలు విడుచునట్లు చేసితీరెదను.”

22 వ జూలై 1855;

".........మన బ్రిటీషువారు వింతవస్తువుల కోసమను నెపమున బొరియలుపెట్టి నవరత్నములను లాగని దేవాలయమే లేదు. ఒకమారు నేను రంగూనులో నట్టి వింతవస్తువులు కొనియుండుటవలన నీ యన్యాయములో నాకును పాలున్నదని తోచుచున్నది."

2 వ డిశంబరు 1857 - లేఖకు 130 వ ఫుటచూడుడు.

డల్‌హౌసీ భారతీయులను ఇంగ్లీషువారిని బులిపింపగల రాజకీయసంస్కరణములు నాగరకతాచిహ్నములు కొన్ని