పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశమున

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

ద్వితీయ భాగము

ఇంగ్లీషు దొరతనము : కంపెనీ రాజ్యము

1600 – 1857

మొదటి ప్రకరణము

ఇంగ్లీషువర్తకసంఘము

ఆంగ్లేయు లీ దేశమునకు వచ్చునప్పటి కిది యత్యంత భాగ్యవంతముగ నుండెను. ఈ దేశాధీశుల ఖజానాలు బంగారు వెండి నాణెములతోను, విలువలేని రత్నములతోను నిండియుండెను. ఈ దేశపరిశ్రమలు అభివృద్ధిలో నుండెను. ఇచ్చటి నుండి అనేకసరకు లెగుమతి చేయబడి బంగారు వెండి దిగుమతి చేయబడుచుండెను. ఈ దేశీయులు ఆశియా ఐరోపా ఆఫ్రికాలతో విరివియగు వర్తకము జరుపుచు అమితలాభము సంపాదించుచుండిరి. ఈ దేశపునూలు మజిలిను వలువలు, పట్టుబట్టలు, ఉన్ని శాలువలు, ఇత్తడి కంచు వస్తువులు ప్రపంచము నందెల్ల ప్రసిద్ధిగాంచెను.

ఐరోపాలోని వివిధ జాతులవా రీ దేశమునకు సముద్రమార్గము గనిపెట్టవలెనని అనేక శతాబ్దములనుండి విశ్వప్రయ