పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

121


ఢిల్లీసుల్తాను "సివిలు పరిపాలనకు మతమునకు ఎట్టి సంబంధమునులేదు. మత మనునది కేవలము వ్యక్తుల ప్రయివేటు వ్యవహారము. అది వారి మనోప్రవృత్తికి సంబంధించిన వినోదము" అనినట్లు ఎలిఫిన్‌స్టను వ్రాసియున్నాడు. ఇరువదియవ శతాబ్దిలో లెనిన్ మహాశయుడుకూడ నట్లే పలికినాడుకదా!

1542 - 45 మధ్య రాజ్యమేలిన షర్షా "మతము కేవలము వ్యక్తులకు సంబంధించిన చిత్తవృత్తి" యనియు దీనికి ప్రాముఖ్యత నొసగకుండా బహిరంగ జీవనమునందు కేవలము రాజకీయ పరిజ్ఞానమును కలిగించుటయే తన యుద్దేశమనియు వెల్లడించెను. (K.Quanungo- Shershah)నాదిర్ షా దేశమును దోచికొన వచ్చినప్పుడు మహారాష్ట్రరాజ్యమును స్థాపించుటకు ప్రయత్నించుచున్న పీష్వాబాజీరావు తన యుద్దములను కట్టిపెట్టి “మన అంతఃకలహము లిప్పుడు ఆలోచింపతగినవికావు. హిందూస్థానమునకిప్పు డొక్కడే శత్రువుకలడు; హిందువులు ముసల్మానులు దక్షిణాపథముయొక్క జనులెల్లరును ఇప్పుడు నడుము కట్టవలెను" అనినాడు (Grant Duff - History of Maharattas).

మహమ్మదీయుల పరిపాలనలో హిందువులకు సివిలుమిలిటరీయుద్యోగములు విరివిగా ఒసగబడుచుండుటయు ఈహిందూమహమ్మదీయులు విశ్వాసపాత్రులై యుండుటయు ఎల్‌ఫిన్‌స్టన్ తనహిందూదేశ చరిత్రలో వర్ణించియున్నాడు. కేవలము మతావేశపరుడని ప్రసిద్దిజెందిన ఔరంగజేబు కాలములోకూడా మతకారణమును బట్టి ఒక్కహిందువునికిగూడ పన్నువిధింప