పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోక్షంలో సింహాసనంమీద వైభవంగా ఆసీనుడైయున్న ప్రభువువు ముందట ఉన్నామనుకోవాలి. అతనికి కొలువు చేస్తున్న దేవదూతలు మనవైపు చూసున్నరనుకోవాలి.ఆలా భావించి భక్తితో జపం చేసికోవాలి.

బెర్నార్డు భక్తుడు కూడ ఈలా నుడివాడు. మనంగుడిలోనికి వెళ్ళినపుడుగాని లేదా మన గదిలోనే జపం చేసికోవడం ప్రారంభించినపుడు గానీ మనలను మనం హెచ్చరించుకొని ఈలా చెప్పుకోవాలి. ఓ దుష్ట ఆలోచనల్లారా! పాపపు వ్యామోహాల్లారా!మీరు బయటనే వుండిపొండి. నా యాత్మమా! నీవు మాత్రం దేవుని సన్నిధిలోనికి ప్రవేశించు అతని చిత్తాన్ని తెలిసికొని అతని ఆజ్ఞలను పాించు. ఈలా మనలను మనం హచ్చరించుకోవడం వల్ల అవధానంతో జపం జేసికోగల్గుతాం

ఈ భక్తులు సూచించిన అభ్యాసాలను వినియోగింకొని మనంకూడ ప్రార్థనకు ముందాు దైవసాన్నిధ్యాన్ని కలిగించుకోవాలి. దీనివల్ల శ్రద్ధాతో ప్రార్ధనం చేసికొంటాం, దేవుణ్ణి కూడ అనుభవానికి తెచ్చుకొంటాం.

7. మనం ప్రార్థనం చేసికొనేపుడు క్రీస్తుకూడ మనతో ప్రార్థనం చేస్తూంటాడు.మనం అతనితో కలిసి భక్తితో ప్రార్థనం చేసికోవాలి. ఈలా క్రీస్తుతో కలిసి పరలోకజపం చెప్పుకోవచ్చు. అది ఆ ప్రభువు స్వయంగా శిష్యులకు నేర్పిన జపం. ఇంకా కీర్తనలూ ఇతర జపాలుకూడ ఈ పద్దాతిలో చెప్పుకోవచ్చు. పెద్దాతేరుసమ్మ ఆ పద్ధతిలో జపించేది.ఆమో యితరులకు కూడ ఈ పద్ధతిని సిపార్సు చేసంది. క్రీస్తు మోక్షములో త్రండి సమక్షములో వుండి నిరంతరమూ మన కొరకు విజ్ఞానం చేస్తూాండని చెప్తుంది హెబ్రేయుల జాబు 7,25. కనుక మనం ఆ ప్రభువుతో కలిసి జపం చేసికోవడంలో ఇబ్బంది ఏమి లేదు. దీనివల్ల మనహృదయంలో సాన్ని ధ్యాన్ని మరింత బలపడుతుంది.

8. దెవసాన్నిధ్యాన్ని గుర్తుకి తెచ్చుకోవడం సులభమే . కాని కొంతసేపయ& ఆయక ఆ సాన్నిధ్యాన్ని పూర్తిగా మర్చిపోతాం. లోక వ్యాపారాల్లో పడపోతాం. ఈలా మర్చి పోకుండ వుండడానికి భక్తులు అనాది కాలంనుండి గూడ భక్తి తీక్షణ జపాలు చెప్పుకొంటూండేవాళ్ళు. ఇవి చిన్న జపాలు. తరచుగా బైబులు వాక్యాలు. కాని యివి చిన్నవైనా అపారమైన భక్తిని కలిగిస్తాయి. వీిటి ద్వారా మన హృదాయాన్ని దేవుని మీదికి త్రిప్పుకోవచ్చు. మర్చిపోయినదేవుణ్ణి మరల గుర్తుకి తెచ్చుకోవచ్చు. వీిటిని వాడుకోవడం ద్వారా శతాబ్దాల పొడగునా చాలమంది భక్తులు అశేష లాభాన్ని సాధించారు. కనుక మనంకూడ వీిటిని వాడుకోవాలి.

69