పుట:బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1.పాపం
బైబులు భాష్యం -5
మనవి మాట
ప్రస్తుత సంచికలో 1-33నంబర్లు పాపాన్నిగూర్చి పూర్వవేదం సూచించేభావాలను పేర్కొంటాయి. వీనిలో 1-11 నంబర్లు ఆదికాండంలోని భావాలను 12-32 నంబర్లు ప్రవక్తల ప్రవచన గ్రంథాల్లోని భావాలను వివరిస్తాయి. ఇక 34-61 నంబర్లు పాపాన్ని గూర్చి

నూత్న వేదం సూచించే భావాలను పేర్కొన్నాయి. వీనిలో34-42 నంబర్లు మూడు సువార్తల్లోని భావాలను, 43-49 నంబర్లు యోహాను రచనల్లో భావాలను, 50-61 నంబర్లు పౌలు లేఖల్లోని భావాలను వర్ణిస్తాయి. ఇదీ విషయ విభాగం.

1. మీరు ఆ చెట్టు పండు మాత్రం తినకూడదు. ఆది 3,3
ఆది దంపతులు ఏం పాపం చేసారో తెలీదు. బహుశ ఆదికాండం వ్రాసినరచయి కూడ తెలీదు. కాని వాళ్ళుమాత్రం దేవుని ఆజ్ఞ మీరారు. దేవునిపట్ల అవిధేయత చూపారు.ఆదా మేవలు చూపాన ఈ యవిధేయతను ఆదికాండం వ్రాసిన రచయిత ఓ కథలాగ

వర్ణించుకుంటూ పోయాడు. కథలా చెప్తేగాని ఆ ప్రాచీన కాలపు హీబ్రూ ప్రజలకు విషయం బోధపడదు.

అన్ని చెట్ల పండ్లూ తినవచ్చుగాని, తోట నడుమనున్న చెట్టు పండ్లు మాత్రం తిన కూడదు ప్రభువు ఆది జననీజనకులకు ఆజ్ఞయిచ్చాడు. కాని ఆ చెట్టు పండు ఏవకు యింపుగా కనిపించింది. దాన్ని తింటే తెలివితేటలు కల్గుతాయికాబోలు అనిపించింది. కావున ఆమె స్వయంగా పండు కోసుకొని తింది. భర్త చేత తినిపించింది- ఆది 3,6. ఇది ఆదామేవల అవిధేయత. ఇదే తొలిపాపం. ఇక్కడ, ఆదామేవలుతినకూడని పండు తిన్నాని మనం నమ్మనక్కరలేదు. కాని దేవుని కట్టడమీరి యేదో చేసారని మాత్రం నమ్మాలి.
నరుడు పాపం చేసినప్పుడెల్ల దేవుని పట్ల అవిధేయత చూపుతుంటాడు.మన పాపాలూ అవిధేయతను చూపుతాయి గనుక, వాని తలంచుకొని పశ్చాత్తాపపడదాం.
2. దేవునిలాగే మీరూ మంచి చెడ్డలు తెలిసికుాంరు - ఆది 3,5
తినవద్దని పండు కోసికొని తినినంత మాత్రాన్నే ఆదామేవలు అంత పెద్ద పాపం చేసారా అని మనం ఆశ్చర్యపోతాం. కాని ఇక్కడ పండు తినడంకాదు, ఏ వుదేశ్యంతో ఆ పండు తిన్నారు అన్నది ప్రధానం. ఆ పండు తిన్నట్లయితే దేవునిలాగే మీరూ మంచి చెడ్డలు తెలిససికుంటారని పాము చెప్పింది, కనుక మంచి చెడ్డలు తెలిసికోవాలన్న కోర్కెతోనే ఆదామేవలు పండు తిన్నారు.