పీఠిక
27
ఈతని తెలుఁగు కృతియగు శ్రీగిరినాథ విక్రమముగాని, తక్కిన కర్ణాటకృతులు గాని నేఁడు గానరాకున్నవి. కాని యీతని కృతియే యనఁదగినదిగా 'నయన రగడ' యని నామాంతరముగలది 'శివభక్తిదీపిక' యనుకృతి కలదు. పరిశీలింపఁగా నా కృతి సోమనాథపురాణ గురురాజచరిత్రములు చెప్పినకథనే నిరూపించునదిగాఁ గానవచ్చినది. ఆ కృతిలోని పట్టులను గొన్నింటిని జూపుచున్నాఁడను. అది కొన్నివందల చరణములు గల రగడ.
క. శ్రీపార్వతీశుఁ జూడక
పాపాత్ముఁడ నగుచుఁ బోవఁ బథమునఁ జక్షుల్
దీపించు దృష్టి దొలఁగిన
శ్రీపతి నడుగంగఁ జెప్పె శివుఁ గర్తనుగాన్.
రగడ : శ్రీశైలవల్లభుని శిఖరంబుఁ బొడగంటి
కాశీపురాధీశు గౌరీశుఁ బొడగంటి,
మహినొప్పు శ్రీశైలమహిమ నేఁ బొడగంటి,
బహువేదశాస్త్రముల్ ప్రణుతి సేయుటఁగంటి
భూలోకకైలాస పురమనఁగఁగనుఁగొంటి
ఫాలాక్షుఁ డిచ్చోటఁ బాయకుండుటఁ గంటి
ధృతిఁదూర్పుమొగసాలఁద్రిపురాంతకముఁగంటి
................................................................................
పర్వతలింగంబుఁ బ్రాణేశుఁడని కంటి
పర్వతేశ్వరుహృదయ పద్మనిలయునిఁగంటి
........................................................................
భక్తుల ప్రతిహత ప్రతిభమతులని కంటి
భక్తులకుఁబ్రత్యర్థిపరులు లేరనికంటి
భక్తులాపదలచేఁబట్టుపడరని కంటి
...........................................................
శివభక్తిదూషకులు చిరపాపులని కంటి,