పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

65


దోరసముద్ర వెంబ హెసరిం కరమొప్పున రాజధానియోళ్
ధీరనృసింహభూవర నహోమహియం పరిపాలిసుత్తిర
ల్కారసియాణ్మ నోలగకె బందనగుర్విసు తాంధ్రదేశ దిం
శౌరియ భృత్యనోపు భువనత్రయతాతన నిప్పునోర్వవం.
శివనిల్లా శివభక్తి యిల్ల శివసిద్దాంతందలిల్లా మతం
సువిచారస్థితిగిల్ల నాడెవనజాక్షం దైవవా వైష్ణవం
సువిశాలం నిజభక్తిగెం దెనుతె పత్రాలంబనం గెయ్యెత
ద్భవియం పద్మరసార్యరోడిసిదరీసానందచారిత్రదిం.
పిందె సమస్తనీలపటసాంఖ్యర బౌద్దర జైనభేదదోళ్
సందరభాట్టతార్కికర కూడతివాదిసి, సోర్కిసూక్తియ
ల్లొందదబద్ధవాదియెనిపుద్ధత వైష్ణవనంవిభాడిసు
త్తిందుధరప్రతిష్ఠయగపద్మరసర్ నెగళ్దర్ ధరిత్రియొళ్.

ఇవిగాక యొక్కొకకవీశ్వరుడును వేర్వేఱుగా సంస్కృతకర్ణాటభాషలలోఁ బద్మరసుమీఁద రచించిన పద్యములును గలవు. పద్మరసుకు సకలశాబ్ధికసార్వభౌమ, ఉద్దతవాది నికరవేశ్యాభుజంగ, తార్కికచక్రవర్తి, శ్రీ శివాద్వైతసాకారసిద్ధాంతప్రతిష్టాపనాచార్య, శరణకవి, భవిదూరాది బిరుదులు గలవు.

ఈతఁడు సానందచరిత్రమునుగాక దీక్షాబోధమని వేఱొకగ్రంథమును గూడ రచియించెను.

పద్యబసవపురాణ కర్తయగు పిడుపర్తి బసవన తండ్రి సోమనాథుఁడీ దీక్షాబోధను దెనిఁగించెను. వీరశైవమతవ్యాపనమున కీగ్రంథ మెంతేని యాకాలమున నుపకరించి యుండును. గురుశిష్యసంవాదరూపమున సులువుగా వీరశైవసంప్రదాయమునెల్ల నీగ్రంథము నిరూపించుచున్నది. తత్కాలపు వీరశైవమతస్వరూపము దెలుపు గ్రంథములలో నిది ప్రధానమయినది. మతవిమర్శము పట్టున నే నెక్కువగా నీ గ్రంథమును గ్రహింతును.

మాయిదేవుఁడు :- ఈతఁడు పద్మరసుపయిఁ బ్రశంసారూపముగాఁ జెప్పిన పద్య మొకటి గలదు.