Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తెలుపరే దయఁ జూచి మలయవాయువులార
            వజ్రపురికిఁ బోవువారె మీరు


తే.

చలువ లొసఁగెడు మేఘరాజంబులార
యమలపక్షత నొప్పు రాయంచలార
నిలిచి నామాటలకు మాఱు పలుకరయ్య
వజ్రపురికిని బోయెడువారె మీరు.

29


క.

అని పలుకుచున్న సమయం
బున నొకశుక మభ్రమార్గమున నేఁగుచు నా
తనిదీనాలాపంబులు
విని కారుణ్యమున నిలిచి విస్ఫుటఫణితిన్.

30


ఆ.

ఏను వజ్రపురికి నేఁగెడుదాన నా
వలనఁ గార్య మేమి కలదు నీకుఁ
దెలుపు మొకటిరెండుపలుకుల ముగియఁగా
ననుచుఁ బలుకుటయును యాదవుండు.

31


సీ.

ఓపక్షివర విను మాపురి శుచిముఖి
            యనుపేరి యొకరాజహంసి యుండు
నది యున్నచోటు నీ వరసి యీపత్రిక
            యందింపవలయు మత్ప్రార్థనమున
నన విని యాచిల్క యట్ల చేసెద సహా
            యంబు పోయెద మాట లాడ నాకు
లే దవకాశంబు లేశమాత్రంబును
            నాదుపక్షంబులనడుమ లేక


ఆ.

యొరుల కెఱుకపడక యుండునట్లుగఁ గట్టు
మతిరయంబుతోడ ననుచు నతని