Jump to content

పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్కొంట దలంప శేషఫణికోఱల వ్రే లిడి గోఁగుకోఁగ ము
క్కంటివెలుంగుకంటఁ జణకంబులు వేఁచుకొనంగఁ బూనరే.

189


తే.

వాండ్రు సురవంశభవులైన స్వర్గమునకుఁ
బ్రళయసమయ మిప్పుడు నాగకులజులైన
నాశకాలంబు తద్భువనమున కిదియ
నరు లయిన నంత్యదశ నేఁడ ధరణి కెల్ల.

190


తే.

ప్రాణములతోడ నిట వాండ్రఁ బట్టి తెచ్చి
తెలిసి తల్లోకమును గడతేర్పవలయు
నీవు చని పట్టి తెమ్మని నిజపురంబు
పెద్దతలవరిఁ దాఁ బంచె భీమబలుని.

191


తే.

వాఁడు చని తిరుగక యున్న వరుస దండ
నాయకోత్తములను దళవాయిఁ బనిచె
వారుఁ దిరుగకుండినఁ దదవస్థఁ దెలిపె
నరులు కోటకొమ్ములఁ గట్టినట్టితలలు.

192


వ.

వజ్రనాభుండు తా నత్యంతకోపాటోపదీపితముఖుం డగుచుఁ
దనతమ్ముఁడు సునాభుండును సకలమిత్రామాత్యవర్గం
బులును రథతురంగమాతంగపదాతివ్రాతపాదఘాతంబుల
చేత భూతలంబు వడవడ వడంక నద్భుతోత్సాహంబునం
జేర్చి కొలువ నలువు మిగిలి కన్యకాభవనప్రాకారంబు
చుట్టు ముట్టుకొనియె నప్పుడు తమవిడుదుల నున్న ప్రద్యు
మ్నగదసాంబులు మన మింతట నంతఃపురప్రవేశంబు సేయక
తడసిన నీబెడిదంపురక్కసునియక్కజంపువిక్రమంబు
కుమారులకు నోర్వ శక్యంబు గా దని పూర్వవిహితమహీ
వివరద్వారంబున నాక్షణంబ ప్రవేశించి భీతివశంబున